తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రవాసాంధ్ర వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. జయరాం సతీమణి పద్మశ్రీ తన భర్తకు ఎలాంటి అర్థికఇబ్బందులు లేవని, తాను ఎవరి నుంచి డబ్బును అప్పుగా తీసుకునే అవసరం కూడా లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా విచారణ సాగించారు. రాకేష్ రెడ్డి జయరాంకు నాలుగు కోట్ల రూపాయలను అప్పుగా ఇచ్చాడన్న కోణంలో పోలీసులు విచారణ సాగడంతో పలు ఆసక్తికర విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
తనకు ఇవ్వాల్సిన నగదును ఇవ్వకపోవడంతో కొట్టాననీ, దీంతో హార్ట్ పేషంట్ కావడంతో జయరాం చనిపోయాడని.. పోలీసు ఉన్నతాధికారుల డైరెక్షన్ లో కట్టుకధలు అల్లుతూ.. జయరాం హత్య జరిగిన నాటి నుంచి చెప్పుకోచ్చిన నిందితుడు రాకేశ్ రెడ్డి.. ఒక్కసారిగా పోలీసుల విచారణలో మాటమార్చాడు. తాను జయరాంను హనీట్రాప్ చేశానని అంగీకరించాడు. కేవలం అతన్ని బెదరించి అతని వద్దనుంచి డబ్బులు లాగేందుకు ప్రయత్నిం చేశానని రాకేష్ రెడ్డి తెలిపాడని సమాచారం.
తాజాగా పోలీసుల విచారణలో రాకేష్ రెడ్డి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడని తెలుస్తోంది. నిజానికి రాకేశ్ రెడ్డికి జయరాం రూపాయి కూడా అప్పు లేడని విచారణలో తేలింది. జయరాంను బెదిరించి డబ్బులు వసూలు చేయాలన్న ఉద్దేశంతోనే నిందితుడు ఆయన్ను ట్రాప్ చేశాడని పోలీసులు తెలిపారు. జయరాంను చంపేసిన అనంతరం హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ వ్యాపారులను రంగంలోకి దించి అప్పు ఇచ్చినట్లు దొంగ పత్రాలు సృష్టించాడని అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే చింతల్ కు చెందిన ఓ రౌడీ షీటర్ ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more