జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద ముష్కరులు పేట్రేగిపోయారు. నెత్తుటేరులు పారించారు. సరిహద్దు ప్రాంతంతో పాటుగా జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రలే లక్ష్యంగా గస్తీ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మరోసారి పిరికిపంద చర్యకు ఒడిగట్టారు. పుల్వామా జిల్లాలో అవంతీపుర ప్రాంతంలోగల లేత్ పోరా వద్ద జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మీదుగా వెళ్లున్న సీఆర్పీఎఫ్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి (ఐఈడీ) భారీ విధ్వంసానికి పాల్పడ్డారు.
సీఆర్పీఎఫ్ జవాన్లపై తుపాకీ కాల్పులు, బాంబు దాడులతో విరుచుకుపడ్డారు. ఐఈడీ బాంబు పేలుడులో 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో 40 మందికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ 54వ బటాలియన్ కు చెందిన వాహనంలో జవాన్లు గస్తీ నిర్వహిస్తున్న క్రమంలో అవంతిపుర వద్ద ఈ దాడి జరిగింది.
సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలను టార్గెట్ చేసిన ముష్కరులు.. ఒక అటోలో ఐఈడీ బాంబును అమర్చి జాతీయ రహదారిపై ఉంచారు. సరిగ్గా ఆ దారినే సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనం వస్తున్న క్రమంలో బాంబును పేల్చడంతో.. 12 మంది జవాన్లు అమరులయ్యారు. సీఆర్పీఎఫ్ 54వ బటాలియన్ చేరువలో బాంబుదాడి జరిగిన వెంటనే ఉగ్రవాదులు.. తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించారు. ఉగ్రవాదుల మెరుపు దాడిలో పలువురు ఉగ్రవాదులు ఘటనాస్థలంలోనే చనిపోయినట్లు సమాచారం.
దీంతో వెనువెంటనే అలర్ట్ అయిన భారత భద్రతా బలగాలు ఉగ్రవాదుల లక్ష్యంగా కాల్పులు జరిపాయి. ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరగడంతో.. ముష్కరమూకలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఉగ్రబీభత్సానికి పాల్పడింది తామేునని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. కాగా, ఈ ఉగ్రదాడిని మాజీ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన ఆయన క్షతగాత్రులకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more