కరీంనగర్ జిల్లాలో మరో పరువు హత్య కలకలం రేపుతుంది. శంకపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన 22ఏళ్ల గడ్డి కుమార్.. వంకాయగూడెం గ్రామ శివారులో రోడ్డుపక్కనే చెట్లలో అతడి మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో పడివుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రేమ వ్యవహారంలోనే అతడిని చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు.. ఇది కచ్చితంగా పరువు హత్యేనని.. అమ్మాయి తరపువారే యువకుడిని హత్యచేశారని అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కుమార్ కు మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. దీంతో ఏడాది క్రితం బాలిక తల్లిదండ్రులు కుమార్ పై నిర్భయ చట్టం కింద్ కేసు నమోదు చేశారు. ఈ కేసు నేపథ్యంలో మృతుడు కుమార్ ఏడాది పాటు జైలులో శిక్షను కూడా అనుభవించాడని పోలీసు కమీషనర్ తెలిపారు. అయితే జైలు నుంచి వచ్చిన కుమార్ నిన్న అమ్మాయిని తీసుకుని వెళ్లాడు. తన ఇంటి సభ్యులకు ఫోన్ చేసి.. తాను ఇంటికి వస్తున్నానని, వచ్చిన తరువాత అన్ని విషయాలు మాట్లాడుకుందామని కూడా చెప్పాడని సీపీ తెలిపారు.
అయితే ఆ తరువాత అతని ఫోన్ కూడా స్విచ్ఛాప్ అయ్యింది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం నుంచి కుమార్ కనిపించడం లేదంటూ అతని కుటుంబసభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారని సీపి తెలిపారు. అయితే ఇవాళ ఉదయం అదే గ్రామశివార్లలో కుమార్ విఘతజీవిగా పడివున్నాడని సీపీ తెలిపారు. కుమార్ ఒంటిపై ఎలాంటి గాయాలు కూడా లేవని, అయితే కుమార్ మరణానికి గల కారణాలు ఏంటన్న వివరాలు తెలియాలంటూ పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు వేచిచూడాలని సిపీ తెలిపారు.
అయితే తాడికల్ గ్రామానికి చెందిన కుమార్… అదే గ్రామానికి చెందిన మరో యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కుమార్ తో పాటు వారి కుటుంబసభ్యులను యువతి తల్లిదండ్రులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. అయినా వారు చాటుమాటుగా కలవడంతో కుమార్ పై నిర్భయచట్టం కింద కేసు కూడా పెట్టారు. దీంతో జైలుకు వెళ్లిన కుమార్ తిరిగివచ్చిన తరువాత ఆదివారం తనకు చివరి కాల్ వచ్చిందని యువతి విలపిస్తూ మీడియాకు చెప్పింది. ఆదివారం రోజున ఓ నలుగురు వచ్చారని… తర్వాత వెళ్లిపోయారని… వాళ్లు తనను బెదిరించారని.. అవసరమైతే తానే వాళ్లను కొట్టడానికి సిద్ధమని కుమార్ చెప్పాడని వివరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more