జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇవాళ కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు అంజనేయస్వామి అలయం నుంచి తన అప్రహిత రాజకీయ యాత్రను ఫ్రారంభించనున్నారు. కాగా అంతకుముందే ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో మరో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జనసేన పార్టీ తరపున తన పార్టీకి సంబంధించిన విషయాలను ముందుగా తన జనసేన సోషల్ మీడియాలో వెల్లడించడం మనం గత కొన్నాళ్లుగా చూస్తున్నాం. ఇదే తరుణంలో ఏ రాజకీయ పార్టీ అచరించని విధానాన్ని అమలుపర్చారు పవన్.
అదే జనసేన పార్టీ వీర మహిళా విభాగం. ఇదేంటి అన్ని పార్టీలకు మహిళా విభాగాలు వున్నాయిగా.. అంటారా.. ఏ రాజకీయ పార్టీకైనా మహిళా కార్యకర్తలు వుంటారు కాబట్టి విభాగాలు వుంటాయి. అయితే ఈ విషయంలో మరో అడుగుముందుకేసిన జనసేన.. మహిళా విభాగానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి.. దానిని కొండగట్టుకు బయలేదేరి వెళ్లబోయే ముందు పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలతో లాంఛనంగా ప్రారంభించారు. జనసేన వివిధ విభాగాలకు ఆసక్తికర పేర్లు పెట్టే పవన్.. మహిళా విభాగానికి కూడా అలాంటి పేరునే పెట్టారు.
'వీరమహిళ' పేరుతో సోషల్ మీడియా బృందాన్ని ఏర్పాటు చేశారు. క్రియాశీలక సభ్యులుగా పనిచేయడానికి ముందుకు వచ్చిన మహిళలకు ఆయన అభినందనలు తెలిపారు. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజా సమస్యలను పార్టీ దృష్టికి తీసువచ్చే విధంగా కృషి చేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలపై మహిళాలోకానికి అవగాహన కలిగించేలా వీరు పూనుకుంటారని పనవ్ చెప్పారు. ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేద్దామని, దేశాభివృద్ధిలో మనవంతు పాత్ర పోషిద్దామని పవన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more