AirAsia India Offers Tickets Priced From Rs. 1,299 చౌకధర యుద్దం.. విమానయానంలో శీతాకాల ఆపర్లు..

Airasia india offers tickets priced from rs 1 299

AirAsia, AirAsia Rs 1299, AirAsia promotional offer, AirAsia scheme, AirAsia promotional scheme, IndiGo, flight tickets

AirAsia, AirAsia Rs 1299, AirAsia promotional offer, AirAsia scheme, AirAsia promotional scheme, IndiGo, flight tickets

చౌకధర యుద్దం.. విమానయానంలో శీతాకాల ఆపర్లు..

Posted: 11/03/2017 11:05 AM IST
Airasia india offers tickets priced from rs 1 299

శీతాకాలాన్ని పురస్కరించుకుని ప్రైవేటు విమానసంస్థలు అప్పుడే రాయితీలు, డిస్కౌంట్ అఫర్లను కురిపించేస్తున్నాయి. ఇప్పటికే చౌకధరల విమానసంస్థగా పేరొందిన ఇండిగో కేవలం రూ. 1120లకు విమానయాన అవకాశాన్ని కల్పించనున్నట్లు ప్రకటించగానే వెనువెంటనే ఎయిర్ ఏషియా కూడా చౌకధరల యుద్దంలో తాను పాల్గొంటున్నట్లు ప్రకటించింది. ఇండిగో చెన్నై బెంగళూరుల మధ్య ప్రయాణానికి కేవలం రూ. 1120ల ధరను ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్ ఏషియా కూడా భువనేశ్వర్-కొల్ కతా ప్రయాణాన్ని కేవలం రూ. 1299లకే అందిస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో పాటు పరిమితకాల ప్రమోషనల్ ఆఫర్ గా రూ. 1,299కి విమానం టికెట్లను అందుబాటులోకి తెచ్చినట్టు ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఈ ఆఫర్ 5వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని, ఏప్రిల్ 30, 2018లోగా ప్రయాణ తేదీని నిర్ణయించుకోవాల్సి వుంటుందని సంస్థ పేర్కొంది. ఎంపిక చేసిన విమానాల్లో ఈ ఫేర్ అమలులో ఉంటుందని వెల్లడించిన సంస్థ, ఎన్ని టికెట్లను ఆఫర్ చేస్తున్నామన్న విషయాన్ని తెలియజేయలేదు.

ఇక సంస్థ వెబ్ సైట్ లో భువనేశ్వర్ - కోల్ కతా రూట్ లో రూ. 1,299కి టికెట్లు అందుబాటులో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కొచ్చి - బెంగళూరు, హైదరాబాద్ - బెంగళూరు,  గోవా - బెంగళూరు రూట్లలో రూ. 1,399కి, భువనేశ్వర్ - రాంచీ మధ్య రూ. 1,490కి టికెట్లు అందుబాటులో ఉన్నట్టు చూపుతోంది. గౌహతి - ఇంపాల్ మధ్య రూ. 1,499, రాంచీ - కోల్ కతా మధ్య రూ. 1,899, కోల్ కతా - వడోదరా, గోవా - హైదరాబాద్, పుణె - బెంగళూరు, విశాఖపట్నం - బెంగళూరు మధ్య రూ. 1,999కి టికెట్లను ఇవ్వనున్నట్టు వెబ్ సైట్ చూపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles