శీతాకాలాన్ని పురస్కరించుకుని ప్రైవేటు విమానసంస్థలు అప్పుడే రాయితీలు, డిస్కౌంట్ అఫర్లను కురిపించేస్తున్నాయి. ఇప్పటికే చౌకధరల విమానసంస్థగా పేరొందిన ఇండిగో కేవలం రూ. 1120లకు విమానయాన అవకాశాన్ని కల్పించనున్నట్లు ప్రకటించగానే వెనువెంటనే ఎయిర్ ఏషియా కూడా చౌకధరల యుద్దంలో తాను పాల్గొంటున్నట్లు ప్రకటించింది. ఇండిగో చెన్నై బెంగళూరుల మధ్య ప్రయాణానికి కేవలం రూ. 1120ల ధరను ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్ ఏషియా కూడా భువనేశ్వర్-కొల్ కతా ప్రయాణాన్ని కేవలం రూ. 1299లకే అందిస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో పాటు పరిమితకాల ప్రమోషనల్ ఆఫర్ గా రూ. 1,299కి విమానం టికెట్లను అందుబాటులోకి తెచ్చినట్టు ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఈ ఆఫర్ 5వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని, ఏప్రిల్ 30, 2018లోగా ప్రయాణ తేదీని నిర్ణయించుకోవాల్సి వుంటుందని సంస్థ పేర్కొంది. ఎంపిక చేసిన విమానాల్లో ఈ ఫేర్ అమలులో ఉంటుందని వెల్లడించిన సంస్థ, ఎన్ని టికెట్లను ఆఫర్ చేస్తున్నామన్న విషయాన్ని తెలియజేయలేదు.
ఇక సంస్థ వెబ్ సైట్ లో భువనేశ్వర్ - కోల్ కతా రూట్ లో రూ. 1,299కి టికెట్లు అందుబాటులో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కొచ్చి - బెంగళూరు, హైదరాబాద్ - బెంగళూరు, గోవా - బెంగళూరు రూట్లలో రూ. 1,399కి, భువనేశ్వర్ - రాంచీ మధ్య రూ. 1,490కి టికెట్లు అందుబాటులో ఉన్నట్టు చూపుతోంది. గౌహతి - ఇంపాల్ మధ్య రూ. 1,499, రాంచీ - కోల్ కతా మధ్య రూ. 1,899, కోల్ కతా - వడోదరా, గోవా - హైదరాబాద్, పుణె - బెంగళూరు, విశాఖపట్నం - బెంగళూరు మధ్య రూ. 1,999కి టికెట్లను ఇవ్వనున్నట్టు వెబ్ సైట్ చూపుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more