వరుస ఉగ్రదాడులతో వణికిపోతున్న బ్రిటెన్ లో మరో మారు ఉగ్రవాదులు పంజా విసిరారు. పశ్చిమ లండన్ పరిధిలోని పార్సన్స్ గ్రీన్ రైల్వేస్టేషన్లో ఇవాళ ఉదయం అఫీసు వేళల్లో పేలుళ్లు సంభవించాయి. లండన్ సబ్ వే (భూగర్భ మెట్రో) రైలులో ఇవాళ ఉగ్రవాదులు రెండు బకెట్ బాంబులను రైలులో పెట్టి.. వారి దిగిపోయిన తరువాత దానిని పేల్చాడంతో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అదికారులు అంబులెన్స్ లలో అస్పత్రికి తరలించారు. కాగా మరో బకెట్ బాంబు కూడా వుందని పోలీసులకు సమాచారం అందడంతో దానిని నిర్వీర్యం చేసేందుకు బాంబు స్వ్కాడ్ ను రంగంలోకి దింపారు.
ఒక్కసారిగా రైలులో పేలుడు సంభవించడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు లోనయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ పరుగులు పెట్టడంతో స్వల్పంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. అపీసు వేళలు కావడంతో రైలులో కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్తు ప్రయాణికులతో రైలు రద్దీగా ఉంది. అదే సమయంలో పేలుడు సంభవించిడంతో ప్రయాణికులు భాయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో తాత్కాలికంగా స్టేషన్ను మూసేసినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లండన్ పోలీసులు పేలుడుపై విచారణ చేపడుతున్నారు.
ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల చర్యేనని అలానే భావిస్తున్నట్లు చెప్పిన మెట్రోపాలిటిన్ పోలీస్ అధికారి.. అ కోణంలోనే దర్యాప్తు చేపట్టనున్నామన్నారు. ఓ తెలుపు రంగు బకెట్లో పేలుడు సంభవించి దాని నుంచి మంటలు వస్తున్నాయన్న వార్తలతో దానిని పోలీసులు పరిశీలించారు. బకెట్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తును సాగిస్తున్నారు. కాగా బకెట్ విస్పోటనం జరిగిన ప్రాంతమంతా రక్తపు మరకలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ ఘటనపై బ్రిటన్ ప్రధానమంత్రి థెరిస్సా మే దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అధికారులను ఎప్పటికప్పుడు అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more