పోలీసులే దొంగలైతే.. టోల్ ప్లాజాను దోచుకుంటే.. ఓహా ఇలా జరిగిందా..? అలా ఎలా జరగుతుంది..? అలా ఎప్పటికీ జరగదు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే ఏకంగా దొంగతనాలకు ఎలా పాల్పడుతారంటూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారా..? కానీ అలాంటి ఘటనే చోటుచేసుకుని సంచలనంగా మారింది. సిఐ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ ఘటన జరగడమే సంచలనంగా మారింది. ఏదో కానిస్టేబుళ్లు కాసుల కక్కుర్తికి పాల్పడ్డారంటే అయ్యివుండవచ్చు అన్న అనుమానాలు రేకెత్తే అవకాశాలు వున్నా.. సీఐ స్థాయి అధికారి దొంగల ముఠాకు నేతృత్వం వహించి.. లైస్సెన్స్ కలిగిన దొంగగా మారాడంటే ఇది నిజంగా చిత్రం కాక మరేమిటి.
ఈ ఘటన ఢిల్లీ-అగ్రాలోని రెండో జాతీయ రహదారిపై ఈ నెల 22వ రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు ఏకంగా అ రహాదారిపై వున్న టోల్ ప్లాజా సిబ్బందిని చితకబాది.. కౌంటర్ లో వున్న నలభై వేల రూపాలను నోక్కేశారు. అంతేకాకుండా ఏకంగా రాత్రి 11.30 నుంచి 2.00 గంటల వరకు వాహానాలన్ని ప్లాజాకు డబ్బులు కట్టకుండా వెళ్లిపోయేలా అడ్డుగా వున్న బ్యారీకేడ్లను ఎత్తించేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫూటేజీ వెలుగులోకి రావడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడినా.. వారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నాతాధికారులు మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు.
టోల్ ప్లాజ అసిస్టెంట్ మేనేజర్ ఓపి యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. సర్కిల్ ఆఫీసర్ నితిన్ సింగ్ సహా ఆరుగురు పోలీసులు ఆగస్టు 22-23 రాత్రి టోల్ ప్లాజాలోకి బొలేరో వాహనంలో చేరుకున్నారు. వారు ఏకంగా లేన్ 13 గుండా ప్రవేశించేందుకు ప్రయత్నించగా, అది కాస్తా తెరుచుకోలేదు. ఈ లేన్ లో వేగంగా వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. పోలీసుల బోలేరో వాహానానికి ఫ్టాస్ లేన్ ట్యాగ్ లేకపోవడంతో.. వారి వాహనం వచ్చినా అక్కడున్న బ్యారీకేడ్ తెరుచుకోలేదు.
దీంతో కోపోద్రిక్తుడైన సిఐ తన సిబ్బందితో టోల్ ప్లాజాలోనికి చోరబడి అక్కడి సిబ్బందిని చితకబాది.. అక్కడ కౌంటర్ లో వున్న సుమారు రూ.40 వేల నగదు దోచుకెళ్లారని తెలిపారు. అయితే, ఈ కేసులో పోలీసుల వాదన మరోలా వుంది. తాము గస్తీ డ్యూటీలో వుండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి, టోల్ ప్లాజా సిబ్బంది అధిక మొత్తంలో ఫీజు తీసుకుంటున్నారని తమకు ఫిర్యాదు చేశారని, దాంతో ప్లాజా మేనేజర్ సహా సిబ్బంది 25 మందిపై కేసు నమోదు చేశామని సర్కిల్ ఆఫీసర్ నితిన్ సింగ్ పేర్కొన్నారు. తమపై ప్లాజా సిబ్బంది చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపడేశారు.
పోలీసుల జులుం వెలుగులోకి వచ్చిన తరువాత కూడా వారిపై చర్యలు తీసుకోవడంలో సంబంధింత శాఖాధికారులు జాప్యం చేస్తున్నారు. పోలీసుల దోపిడీ, దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన మీదట తాము స్పందిస్తామని.. ఉన్నతాధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసం.? ఇక వాహనదారులు పిర్యాదు చేస్తే టోల్ ప్లాజా సిబ్బందిపై కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపాల్సిన పోలీసులు డబ్బను దొంగలించాల్సన అవసరమెందుకు వచ్చింది.? అక్కడి సిబ్బందిపై తమ ప్రతాపాన్ని చూపాల్పిన అవసవరమెందుకు వచ్చిందన్న ప్రశ్నలకు ఉన్నతాధికారులైనా బదులిస్తారో లేదో వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more