భారతీయ న్యాయవ్యవస్థలో తొలిసారి ఓ ఎలక్ట్రానిక్ డాటాను అధారంగా చేసుకుని కామాంధులకు కఠిన శిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఇప్పటి వరకు న్యాయస్థానంలో ఎలక్ట్రానిక్ డాటాను అధారంగా చేసుకోలేదు. అయితే పలు కేసుల్లో వీడియోలు, అడియోలను సాక్షాలుగా పరిగణించినా.. తొలిసారిగా సామాజిక మాద్యమం ద్వారా చాట్ చేసిన డాటాను, అదే సోషల్ మీడియాలో బాధితురాలికి సంబంధించిన దృష్యాలను పెట్టి తమ ఫ్రెండ్స్ కు పంఫిణీ చేయడం లాంటి అంశాలను తొలిసారిగా న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది.
హర్యానాలోని సోనేపట్ లో గల ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో తమ జూనియర్ గా చేరిన బాధితురాలిని రెండేళ్ల పాటు లైంగికంగా వేధించి.. పలుమార్లు అమెపై అత్యాచారానికి ఒడిగట్టి.. అమె నగ్న చిత్రాలను తీసి తమ స్నేహితులకు పంపి ఫైశాచిక అనందం పోందడంతో పాటు దానిని యాపిల్ ఐ క్లౌడ్ లో దాచినందుకు గాను సీనియర్ విద్యార్థులను దోషులుగా తేల్చిన న్యాయస్థానం.. అందుకు సామాజిక మాద్యమంలో వారు సాగించిన సంభాషణను అధారంగా చేసుకునింది. దీంతో వారిలో ప్రధాని దోషితో హార్దిక్ సిక్రీ పాటు అతడి స్నేహితుడు కరణ్ ఛాబ్రా 20 ఏళ్ల పాటు జైలు శిక్షను విధించగా, మరో విద్యార్థి వికాస్ గార్గ్ కి ఏడేళ్ల పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది.
ఇక అప్పటి నుంచి అమెను నిత్యం నరకం చూపుతు వచ్చారు. దీంతో పాటు ఈ విషయాన్ని ఎవరికైనా చెడితే దేనికైనా వెనుకాడబోమని, బాధిరతురాలితో పాటు అమె కుటుంబ పరువును కూడా తీసేస్తామని బెదిరించారు. దూర ప్రాంతాలకు బలవంతంగా తీసుకెళ్లి కోరిక తీర్చుకుని తెచ్చేవారు. వారి చేతిలో రెండేళ్ల పాటు నిత్యం నరకం అనుభవించిన బాధితురాలు చివరికి విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పింది. వారి సాయంతో పోలీసులకు పిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపర్చారు. 2015 ఏప్రిల్ నుంచి సాగిన కేసులో న్యాయస్థానం తీర్పు వెలువడింది. నిందితులు, బాధితురాలికి మధ్య జరిగిన వాట్స్ యాప్ సంభాషణనే కోర్టు సాక్ష్యంగా పరిగణిస్తూ, హార్దిక్ సిక్రీ, కరణ్ ఛాబ్రాలకు 20 ఏళ్ల జైలు శిక్ష, మరో విద్యార్థి వికాస్ గార్గ్ కి ఏడేళ్ల జైలు శిక్షను న్యాయమూర్తి విధించారు. వాట్స్ యాప్ సంభాషణలే సాక్ష్యంగా పరిగణిస్తూ.. ఈ కేసులో తన తీర్పును వెలువరిస్తున్నానని కేసును విచారించిన అదనపు సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ సునీతా గ్రోవర్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more