తెలుగు రాష్ట్రాలకు పిడుగులాంటి వార్తను వెలువరించింది భారత వాతావరణ శాఖ. భానుడి ప్రచండ ప్రతాపంతో ఉడికిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేద తీర్చే కబరు అందుతున్న తరుణంలో సరిగ్గా గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా రుతు పవనాల విస్తరణకు బ్రేక్ పడుతుందని తెలిపింది. వర్షం కోసం ఎదురు చూసే అన్నదాతకు ఈ సారి వర్షాలు సాధారణం కన్నా అధికంగా వున్నాయన్న అంచనాలతో సంతోషపడగా, రుతు పవనాల విస్తరణ సకాలంలో జరుగుతుందా..? వర్షాలు సకాలంలో పడతాయా లేదా..? అన్న అందోళన రైతన్నలో నెలకొంది.
జార్ఖండ్ నుంచి ఉత్తరకోస్తా వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం చేత క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ముఖ్యంగా 7, 8 తేదీల్లో తెలంగాణలో.. 8, 9 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అయితే వర్షాలు లేనిచోట మాత్రం భానుడు తమ ప్రతాపాన్ని చాటే అవకాశముందని తెలిపింది. అప్పుడప్పుడు వర్షాలు కురిసినా పూర్తిస్థాయిలో వాతావరణం చల్లబడదని.. రుతుపవనాలు ప్రవేశించే వరకు రాష్ట్రంలో సాధారణం కంటే అధిక ఎండలు తప్పవని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే రుతుపవనాలను అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అడ్డుకుంటోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి వై.కె.రెడ్డి తెలిపారు. మూడు నాలుగు కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్న ఆవర్తనం కారణంగా.. నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలోనే నిలిచిపోయాయని... అవి ముందుకు కదలడానికి అనువైన వాతావరణం లేదని చెప్పారు. ఉపరితల ఆవర్తనం ఈ నెల 8 నాటికి తగ్గిపోయే అవకాశం ఉందని.. ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు బలపడి తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని వెల్లడించారు. ఈ నెల 12 నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశముందని చెప్పారు. సో ఫ్రెండ్స్ బీ కేర్ పుల్.. బయటకు వెళ్లేప్పుడు తప్పనిసరిగా రెయిన్ కోట్స్, లేదా గొడుగులు తీసుకెళ్లండి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more