డిజిటల్ ఇండియా అంటూ యావత్ ప్రపంచాన్ని మన దేశం అకర్షింస్తుంది. కేంద్రం మేక్ ఇన్ ఇండియా పిలుపుతో.. భారత్ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ఇప్పటికే ముందుకు వచ్చాయి. పలు కంపెనీలు తమ ఉత్పత్తులను కూడా ప్రారంభించే స్థాయికి చేరుకున్నాయి. అయితే అనేక కంపెనీలు నగరాలకు శివారల్లో వున్న ప్రాంతాల్లో నెలకొల్పడం చేత వాటికి అసలైన కమ్యూనికేషన్ విభాగం కొంత సమస్యగా మారుతుంది. తమ ఫోన్ సిగెల్స్ అందక.. వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. ఇక దీనికి తోడు కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన నగదు రహిత లావాదేవీలపై కూడా జనం పెదవి విరుస్తున్నారు.
పట్టణ ప్రజలు ఫర్వాలేదని కేంద్ర నిర్ణయాన్ని శ్లాఘించి, స్వాగతించినా.. గ్రామీణ భారతంలో మాత్రం ఈ విధమైన సేవలకు అస్సలు సానుకూల పరిస్థితులు లేవు. అందుకు కారణం.. ఈ లావాదేవీలతో తామెక్కడ నష్టపోతామోనన్న అందోళన వారిలో వుంది. తమను దుకాణాదారులు మోసం చేస్తారేమోనన్న భయం వారిలో నెలకొనడమే ఇందుకు కారణం. ఇక నిరక్ష్యరాసత్య కూడా దీనికి మరో కారణంగా నిలుస్తుంది. తమ అధార్ కార్డు నెంబర్ వారికి చెబితే.. దానిని వారు మరోలా వినియోగించుకునే అవకాశం కూడా వుందన్న వార్తలు ప్రచారంలోకి రావడంతో.. అది కూడా వారిని బయపెడుతోంది.
ఇక కాస్తా కూస్తో చదవుకున్న యువత ప్రధాని పిలుపుతో మంచే జరుగుతుందని అశించి.. నగదు రహిత లావాదేవీల వైపు అకర్షితులవుతున్నా తమ మొబైల్ ఫోన్ లో సిగ్నల్స్ సమస్య తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో వారు ఈ లావాదేవీలపైవు విముఖత వ్యక్తం చేస్తున్నారు. పట్టణాలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్ సమస్య మరీ అదికంగా వుంటుంది. టవర్స్ కు దూరంగా ఉండే మారుమూల గ్రామాల్లో నెట్వర్క్ అంతగా ఉండదు. దాంతో జనాలు గుట్టపైనో, చెట్టుపైనో ఎక్కి మాట్లాడుతుంటారు.
సరిగ్గా ఇదే పరిస్థితి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కు ఎదురైంది. రాజస్థాన్లోని తన నియోజకవర్గంలో పర్యటించిన ఆయనకు ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో అయన కూడా ఓ చెట్టుపైకి ఎక్కి ఆ తరువాత ఫోన్ మాట్లాడాల్సి వచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో.. ఇప్పటికైనా కేంద్రం దేశవ్యాప్తంగా న్యాణమైన సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ తరువాత డిజిటిల్ ఇండియాపై ప్రచారం చేస్తే బాగుంటుందని నెట్ జనుల నుంచి పలు విమర్శలు వినడడుతున్నాయి. దేశప్రజలపై బలవంతంగా కేంద్రం నిర్ణయాలను రుద్దే బదులు క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించాలని పలువురు సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more