కేంద్రంలో గత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన పథకానికి ప్రస్తుత నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు పలికింది. అధార్ సహా పలు పథకాలకు ఇప్పటికే పూర్తి స్థాయిలో అచరణలోకి తీసుకోచ్చిన మోడీ సర్కార్.. తాజాగా మరో కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తుంది. విదేశాలలో స్థిరపడిన, లేక తాత్కాలికంగా వున్న ఎన్ఆర్ఐలు తమ కన్నతల్లి లాంటి భారత్ మాతకు, దేశంలోని ప్రజలకు సేవ చేసేందుకు ప్రభత్వం ప్రకటించిన వివిధ పథకాలకు తమ వంతు ఆర్థిక సహాయం చేసేందుకు గాను యూపీఏ ప్రభుత్వం తీసుకోచ్చిన ఐడీఎఫ్ కార్యక్రమానికి ఎన్డీయే ప్రభుత్వం కోనసాగిస్తుంది.
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఐడీఎఫ్ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు విరివిగా పాల్గోనాలని పిలుపునిచ్చారు. భారత్లో అమలు చేస్తున్నపలు కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని విదేశాంగ శాఖ ట్విట్టర్ అకౌంట్లో వీడియో పోస్ట్ చేశారు. ఇండియా డెవలప్మెంట్ ఫౌండేషన్(ఐడీఎఫ్) కార్యక్రమం కింద ప్రవాస భారతీయులు తమ ఆర్థిక సహాయం అందజేయవచ్చని అమె కోరారు.
వీటిని భారత ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ ఇండియా, గంగా నది ప్రక్షాళనతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు ఉపయోగిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విదేశాల్లో నివసిస్తున్నా పుట్టిన దేశంతో తమ అనుబంధాన్ని కొనసాగించేందుకు ఎన్ఐఆర్ఐలకు ఇదో చక్కని అవకాశమని ఆమె తెలిపారు. భారత అభివృద్ధిలో తమ వంతుగా పాలుపంచుకునేందుకు చాలామంది ఎన్ఆర్ఐలు ఎదురుచూస్తున్నారని, అలాంటి వారి కోసమే ఈ ఐడీఎఫ్ కార్యక్రమాన్ని రూపొందించారని సుష్మాస్వరాజ్ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more