జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీలో మునుపెన్నడూ లేని విధంగా ఇవాళ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికార, విపక్షాలను చెందిన అభ్యర్థులు చేయి చేయి చేసుకున్నారు. అంతేకాదు ఒకరిపై మరోకరు పిడి గుద్దులతో తలపడ్డారు. భారత దేశం తలలో సిగలా, సిగలో పుష్పంటా వుండే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలోని ఈ భయానక దృశ్యాలను చూసి రేపటి పౌరులు ( విద్యార్థులు) భయాందోళనకు గురయ్యారు. చట్టసభలకు ఎన్నికయ్యామన్న గర్వంతో హుందాగా నడుచుకోవాల్సిన శాసనసభ్యులు ఒకరితో మరోకరు తలపడి శాసనసభ హుందాతనానికి మంగళం పాడారు.
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ విద్యుత్ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. చర్చ సందర్భంగా అధికార పీడీపీ, ప్రతిపక్ష నేషనల్కాన్ఫరెన్స్ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా వారిని అడ్డుకునేందుకు అధికారపక్ష సభ్యులు ప్రయత్నించారు. విద్యుత్ ప్రాజక్టులను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తేవడంలో పీడీపీ, బీజేపీ సర్కారు విఫలమైందని నేషన్ కాన్ఫరెన్స్ ఆరోపించింది. సభలోనే ధర్నాకు దిగింది. దీంతో అధికార పక్ష సభ్యులు విపక్ష సభ్యులతో కలబడటంతో హింసాత్మక ఘటనకు దారితీసింది.
అయితే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో శాసనసభ్యులు చట్టాలను ఎలా చేస్తారు..? ఎలా అమోదిస్తారు..? అన్న విషయాలను ప్రత్యక్షంగా చూసేందుకు అతిధులుగా హాజరైన విద్యార్థులు షాక్ గురయ్యారు. శాసనసభ్యులు ఒకరితో మరోకరు కలబడటం, పిడిగుద్దులకు తెగబడటం చూసి బెంబేలెత్తిపోయారు. ఒకరినోకరు తోసుకుంటూ.. అసెంబ్లీలోని బెంచీలను ఎత్తేయడం, ఎంతో విలువైన పత్రాలను విసేరయడం చూసి విద్యార్థులు భీతిల్లిపోయారు. మార్షల్స్ వారించినా వినని శాసనసభ్యులు కలబడటంతో పాటు అడ్డుగా నిలచి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తున్న మార్షల్స్ ను సైతం వదలకుండా మీడపడటం ఘటనలతో వారు భయాందోళన చెందారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more