భగవంతుడి దూతగా తనకు తాను ప్రచారం చేసుకున్న వివాదాస్పద గురువు ఆసారం బాబు తనయుడు నారాయణ సాయి పలువురకి ఇవ్వజూపిన లంచం డబ్బును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీజ్ చేశారు. సూరత్ కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు కేసు దర్యాప్తులో భాగం పంచుకునే అధికారులకు, వైద్యులకు, పోలీసుకలు, న్యాయమూర్తులకు లంచాలను ఆశగా చూపి.. తమకు అనుకూలంగా సాక్షాలను మార్చుకునేందుకు ఆసారాం బాపు తనయుడు నారాయణ సాయి యత్నించినట్లు అధికారుల తేల్చారు.
సూరత్ కు చెందిన వ్యాపారవేత్త కెతన్ పటేల్ నుంచి 8 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న అధికారులు, మరో మహిళా రీనా వాగలే నుంచి కూడా 10 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కేతన్ పటేల్ రియల్ ఎస్టేటు వ్యాపారి, కాగా రీనా వాగలే.. సాదారణ గృహిణి అని. ఇద్దరిని లంచం కేసులో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గత ఏడాది నారాయణ సాయి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన ఈడీ అధికారుల.. లంచాల విషయమై ప్రశ్నించగా ఆయన ఈ మేరకు వివరాలను వెల్లడించారు. తాను తన అనుచరుడు ఉదయ్ సంఘానిని పటేల్ నుంచి డబ్బును తీసుకుని, దానిని నరేష్ మల్కానీ అనే వ్యక్తి అందజేయమని చెప్పినట్లు చెప్పానని ఒప్పకున్నాడు. నరేష్ మల్కానీ వాటిని పోలీసు అధికారులతో పాటు న్యాయమూర్తులకు అందిస్తాడని నారాయణ సాయ్ అంగీకరించాడు. ఈ కేసులో ఇప్పటికే 14 మందిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తును కోనసాగిస్తుండగా, ఈడీ అధికారులు లంచం డబ్బును సీజ్ చేశారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more