కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఏడాది బాలీవుడ్ తారలతో పాటు, ఆత్యాత్మిక గురువులు, రాజకీయ కురువృద్దులకు దేశ అత్యున్నత పౌర పురస్కారాలను అందించాలని నిర్ణయంపై ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. మొత్తం 148 మందికి ప్రముఖులకు పద్మ అవార్డులను అందించాలని నిర్ణయించినప్పటికీ.. అందులో అధ్యాత్మిక గురువులకు, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపి ప్రచారానికి పత్యక్షంగా, పరోక్షంగా దోహదపడిన పలువురికి దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పద్మ అవార్డు జాబితాల పలువురు గురువులు, హింధూ మఠాధిపతులు, బీజేపి నాయకులు, బిజేపీ మిత్రపక్ష నేతలకు అత్యున్నత పౌర పురస్కారాలను ఎలా అందిస్తారంటూ సామాజిక మాధ్యమాలలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా యెగా గురు బాబా రాందేవ్ కు పద్మభూషన్ అవార్డుకు ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు కేసులు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కోంటున్న వారికి దేశ అత్యున్నత పౌర పురస్కారాలను ఇచ్చి సత్కరించడంలో ఆంతర్యమేమిటో కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికే తెలియాలని నెట్ జనులు ప్రశ్నలను సంధిస్తున్నారు.
అటు అవార్డలను ఎంపికైన వారితో పాటు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శల పర్వం సాగుతోంది. తమద పార్టీ మతపరమైనది కాదని, ప్రభుత్వం దేశ ప్రజలందరిదని చెబుతూనే.. అందుకు భిన్నంగా వ్యవహరించడంపై అంతర్జాల ప్రజలు కేంద్ర అంతరంగాన్ని ఎండగడుతున్నారు. మతవాద ప్రకటనలు చేసిన, వ్యాఖ్యలు చేసిన పలువురు బీజేపి నేతలపై పార్టీ అధిష్టానం తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం, ఇప్పుడు పీఠాధిపతులకు, అద్యాత్మిక గురువులకు, పార్టీ ప్రచారానికి పాటలు రాసిన వారికి, బీజేపీ నేతలకు ఎన్నికల స్క్రిప్టు రూపోందించిన వారికి అవార్డులను అందించడం ఏంటని సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు కేంద్రంలోని మోడీ సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more