పాయకరావుపేటలో పోలింగ్ ముగిసింది. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) అభ్యర్థుల జాతకం నిక్షిప్తమైంది. మునుపెన్నడూ లేని విధంగా 85 శాతం ఓటింగ్ నమోదు కావడం అన్ని పార్టీలను ఆలోచనలో పడేసింది. పెరిగిన పోలింగ్ శాతం తమ అభ్యర్థులను గెలుపుబాటలో నడిపిస్తుందన్న ధీమాలో మూడు పార్టీలు వున్నాయి. మండలాల వారీగా పోలింగ్ సరళిని బట్టి విజయావకాశాలను బేరీజువేసే పనిలో తలమునకలై వున్నాయి. గెలుపు తథ్యం..మెజారిటీ ఎంతన్నది తేలాల్సి వుందని అన్ని పార్టీలు పేర్కొంటుండడం విశేషం. పాయకరావుపేటకు పోలింగ్ పూర్తికావడంతో ఎన్నికల తొలిఘట్టం ముగిసింది. మలిఘట్టం ఓట్ల లెక్కింపు కోసం రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. మంగళవారం జరిగిన పోలింగ్లో అనూహ్యంగా 85 శాతం నమోదైంది. ముఖ్యంగా మహిళలు, యువకులు బారులు తీరి మరి ఓటు హక్కు వినియోగించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గంటెల సమన, తెలుగుదేశం అభ్యర్థి చెంగల వెంకట్రావు, వైఎస్సార్ సీపీ అభ్యర్థి బాబూరావుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. 2009 సంవత్సరంలో పోల్చుకుంటే ఈసారి ఎన్నికల్లో పోలింగ్ పది శాతం పెరగడం అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్నది. ఇది ఏ పార్టీకి ప్లస్గా మారుతుందో...మరే పార్టీలను ముంచుతుందో అన్న ఆందోళన మూడు పార్టీల్లో వ్యక్తమవుతున్నది. మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఓటింగ్లో పాల్గొనడం కాంగ్రెస్కు కలిసొచ్చే అంశమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో మహిళలు మొదటి నుంచీ తమకు అండగా నిలుస్తున్నారని, ప్రస్తుత ఎన్నికల్లోను ఇదే చరిత్ర పునరావృతం అవుతుందని టీడీపీకి నేతలు పేర్కొంటున్నారు. పైగా, పార్టీకి దూరమైన కొన్ని సామాజిక వర్గాలు తిరిగి పార్టీ వెంట నడవడం కలిసొచ్చిందంటున్నారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ విషయానికొస్తే 'సానుభూతి' పవనాలు బలంగా వీయడం వల్లనే మహిళలు భారీగా తరలివచ్చి ఓటు వేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది తమ పార్టీకి లాభిస్తుందని నేతలు చెబుతున్నారు. యువత ఓటింగ్ కూడా పార్టీ వైపే వుందని వారంటున్నారు. ఇదేకాకుండా, మండలాల వారీగా పోలింగ్ తీరును పరిగణనలోకి తీసుకుని కూడా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. మండలాల్లో అనుకూల, ప్రతికూల ప్రాంతాలను గుర్తించి ఓటింగ్పై అంచనా వేసుకోవడంలో అన్ని పార్టీలు బిజీబిజీగా వున్నాయి. ఏదిఏమైనప్పటికీ, తమ పార్టీదే అంతిమ విజయమని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పాయకరావుపేట ఎన్నికల విజయంపై భారీగా బెట్టింగ్లు భారీగా సాగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more