క్రికెట్ అభిమానులకు త్వరలోనే ఐపీఎల్ మజా లభించనుంది. ఈ వేసవిలో జరిగే ఐపీఎల్ తాజా సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ తేదీని లీగ్ పాలకమండలి ఖరారు చేసింది. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా ఆటగాళ్ల వేలం ఉంటుందని ఐపీఎల్ వెల్లడించింది. ఇటీవల పలు ఫ్రాంచైజీలు తమకు అక్కర్లేని ఆటగాళ్లను విడుదల చేశాయి. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఐదుగురు ఆటగాళ్లను రిలీజ్ చేయగా, కెప్టెన్ స్టీవ్ స్మిత్ సహా ఎనిమిది మంది ఆటగాళ్లను రాజస్థాన్ రాయల్ వదిలించుకుంది.
ముంబయి జట్టు ఒక్క లసిత్ మలింగను విడుదల చేయగా, పంజాబ్ జట్టు గ్లెన్ మ్యాక్స్ వెల్, షెల్డన్ కాట్రెల్ ను వేలానికి విడిచిపెట్టింది. పంజాబ్ వద్ద ఇంకా రూ.53.2 కోట్ల సొమ్ము ఉండడంతో ఈసారి ఎవరిని తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి ఏర్పడింది. అన్ని ఫ్రాంచైజీల కంటే తక్కువగా సన్ రైజర్స్ వద్ద రూ.10.75 కోట్లు మాత్రమే ఉండడంతో ఈ ఫ్రాంచైజీ రాబోయే వేలంలో పెద్ద ఆటగాళ్ల కోసం ప్రయత్నించే పరిస్థితులు లేవు. ఎప్పట్లాగానే ఓ మోస్తరు ఆటగాళ్లతో సరిపెట్టుకుంటుందని భావిస్తున్నారు.
ఈ వేలంలో ప్రధానంగా గ్లెన్ మ్యాక్స్ వెల్, స్టీవ్ స్మిత్ పై అందరి దృష్టి ఉండనుంది. గత ఐపీఎల్ సీజన్ లో వీళ్లిద్దరూ విఫలమయ్యారు. అయితే, బిగ్ బాష్ లీగ్ లో మ్యాక్స్ వెల్ శివమెత్తి ఆడగా, టీమిండియాతో టెస్టు సిరీస్ లో స్మిత్ సెంచరీతో విమర్శకులకు సమాధానం చెప్పాడు. ఈ నేపథ్యంలో, ఐపీఎల్ తాజా వేలంలో వీరిద్దరినీ ఎవరు తీసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Mar 18 | సూర్యకుమార్ యాదవ్ కల ఎట్టకేలకు సాకరమైంది. టీమిండియా తరఫున ఆడాలన్న అతడి నిరీక్షణకు తెరపడి, ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ... Read more
Feb 27 | దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్కు కెప్టెన్ మిథాలీ రాజ్, 3 టీ20 మ్యాచ్ల సిరీస్కు హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సభ్యుల... Read more
Feb 27 | ఇంగ్లండ్తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్బౌలర్ అహ్మదాబాద్ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత... Read more
Feb 16 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్ను విడుదల చేయగా, అందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పర్యాటక జట్టుపై ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్... Read more