ధోని- యువరాజ్ భాగస్వామ్యంలో సరికొత్త రికార్డు.. dhoni yuvraj creates record partner ship in cuttack odi

Dhoni yuvraj creates record partner ship in cuttack odi

yuvraj singh, mahedra singh dhoni, team india, england, record partnership, second one day, cuttack odi, sports news, cricket

Team India former captain mahendra singh dhoni and yuvraj singh creates record partnership in cuttack odi by scoring 173 runs for fourth wicket

ధోని- యువరాజ్ భాగస్వామ్యంలో సరికొత్త రికార్డు..

Posted: 01/19/2017 09:49 PM IST
Dhoni yuvraj creates record partner ship in cuttack odi

పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో కటక్ వేదికగా బారాబతి స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో నాటి టీమిండియా కెప్టెన్ వైస్ కెప్టెన్లు ఇద్దరు మంచి ఫామ్ లోకి వచ్చారు. పర్యాటక జట్టుతో జరుగుుతన్న తొలి వన్డేలో ఇద్దరు పేలవ ప్రదర్శనను ఇవ్వగా, రెండో వన్డేలో మాత్రం ఇద్దరు విజృంభించి తమ సత్తాను ప్రదర్శించారు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్-మహేంద్ర సింగ్ ధోని జంట తమ పేరున సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ మ్యాచ్లో యువరాజ్ సింగ్-ధోనిలు చెలరేగి ఆడి నాల్గో వికెట్కు ఇంగ్లండ్ పై అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

కటక్ వన్డేలో వీరిద్దరి అజేయ భాగస్వామ్యంలో 173 పరుగుల మార్కును చేరడం ద్వారా ఆ జట్టుపై నాల్గో వికెట్కు అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతకుముందు 2012లో దక్షిణాఫ్రికా జోడి హషీమ్ ఆమ్లా-ఏబీ డివిలియర్స్లు ఇంగ్లండ్ పై నాల్గో వికెట్ కు నమోదు చేసిన 172 పరుగుల అజేయ భాగస్వామ్యమే ఇప్పటికే వరకూ అత్యధికం. దాన్ని నాలుగేళ్ల తరువాత యువీ-ధోనిలు సవరించి కొత్త రికార్డు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles