ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో వేదికగా జరుగుతున్న నాల్గో టెస్టు తొలి రోజు టీమిండియాపై అతిధ్య జట్టు పైచేయిని కనబర్చింది. తొలి రోజు అటముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 288 పరుగులు సాధించింది. భారత్ ఇద్దరు అల్ రౌండర్లు మాత్రమే పర్యాటక జట్లు ఐదు వికెట్లను సాధించారు. అయితే ఫుల్ టైం బైలర్లు మాత్రం అంతగా ప్రతిభ కనబర్చలేకపోయారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టులో ఈ మ్యాచ్ తోనే అరంగ్రేటం చేసి కీనట్ జెన్నింగ్స్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. తొలుత సున్నా పరుగుల సమయంలో అయన ఇచ్చిన క్యాచ్ ను భారత అటగాళ్లు మిస్ చేయడంతో నిలదోక్కుకున్న జెన్నింగ్స్ (112;219 బంతుల్లో 13 ఫోర్లు) శతకం సాధించాడు. అటు ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్(46) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. ఈ జోడి తొలి వికెట్ కు 99 పరుగులు జోడించిన తరువాత కుక్ పెవిలియన్ చేరాడు.
రవీంద్ర జడేజా బౌలింగ్లో ముందుకొచ్చి ఆడబోయిన కుక్ను పార్థీవ్ పటేల్ స్టంప్ చేసి వెనక్కు పంపాడంతో బోజన విరామ సమయానికి ఇంగ్లాండ్ ఒక వికెట్ కోల్పోయింది. కాగా, ఆ తరువాత వచ్చిన జో రూట్ ను కూడా స్వల్ప స్కోరుకే అశ్విన్ వెనక్కు పంపాడు. ఆ తరుణంలో వచ్చిన మొయిన్ అలీ.. జెన్నింగ్స్ తో కలసి మూడో వికెట్ కు 94 పరుగులు భాగస్వామ్యాని సాధించి స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది.
కాగా, జట్టు స్కోరు 230 పరుగుల వద్ద ఉండగా అలీ మూడో వికెట్ గా అశ్విన్ బౌలింగ్ లో పెవీలియన్ చేరాడు. ఆ తరువాత శతకం సాధించిన జెన్నింగ్స్ను కూడా అశ్విన్ కు చిక్కి వెనక్కు వెళ్లాడు. మరో 19 పరుగుల వ్యవధిలో బెయిర్ స్టో(14)కూడా అశ్విన్ కు చిక్కడంతో భారత్ పట్టు సాధించినట్లు కనబడింది. అయితే ఆ తరువాత బెన్ స్టోక్స్(25 బ్యాటింగ్), బట్లర్(18 బ్యాటింగ్)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడటంతో మళ్లీ ఇంగ్లండ్దే పైచేయి సాధించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more