అంతర్జాతీయ టీ 20 క్రికెట్ ర్యాంకింగ్స్లో రెండో ర్యాంకులో కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా.. ఆ ర్యాంకును మరికొంతకాలం కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఇరు జట్ల మధ్య శని, ఆదివారాల్లో రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో ధోని అండ్ గ్యాంగ్ విజయం సాధిస్తే రెండో ర్యాంకును పదిలంగా ఉంచుకుంటుంది. ఒకవేళ ఈ సిరీస్ను విండీస్ క్లీన్ స్వీప్ చేస్తే మాత్రం భారత్ మూడో ర్యాంకు పడిపోతుంది. అప్పుడు విండీస్ రెండో స్థానానికి చేరుతుంది.
దాదాపు ఐదు నెలల క్రితం జరిగిన టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో విండీస్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి భారత్ ఘనమైన ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ రెండు మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించిన పక్షంలో 132 రేటింగ్ పాయింట్లతో ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరువగా వస్తుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ 132 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అయినప్పటికీ దశగణ సంఖ్య ప్రకారం భారత్ రెండో ర్యాంకుకే పరిమితం అవుతుంది. అదే క్రమంలో సిరీస్ డ్రాగా ముగిస్తే మాత్రం ఇరు జట్ల ర్యాంకింగ్స్లో మార్పు ఉండదు. ఇక ఆటగాళ్లు ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లి తన అగ్రస్థానాన్ని నిలుపుకోవాలంటే మెరుగ్గా రాణించాల్సి ఉంది. విరాట్ తరువాత ఆస్ట్రేలియా ఆటగాడు అరోన్ ఫించ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆ ఇద్దరి ఆటగాళ్ల మధ్య రాంకింగ్స్ విషయంలో 34 పాయింట్లు మాత్రమే తేడా ఉంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more