ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ పై అడ్డంకులు తొలగినట్లే. ముంబైలో ఐపీఎల్ ప్రారంభపు మ్యాచ్ సజావుగా సాగుతుంది. ఫస్ట్ మ్యాచ్ పై ఎలాంటి స్టే ఇవ్వడం లేదని బాంబే హైకోర్టు ప్రకటించింది. మహారాష్ట్రలో నీటి సంక్షోభం, ఐపీఎల్ కు నీరు వృథా చేస్తున్నారని ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్ – ప్రజాప్రయోజన వ్యాజ్యం- ను విచారిస్తున్న బాంబే హైకోర్టు ఈ వివరణ ఇచ్చింది. పిల్ ను విచారణకు చేపట్టిన సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలు, మ్యాచ్ లను తరలించాలన్న సూచన నేపథ్యంలో ముంబైలో జరగాల్సిన ఐపీఎల్ ప్రారంభపు మ్యాచ్ పై సందిగ్థం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9న ఐపీఎల్ ప్రారంభపు మ్యాచ్ సజావుగా సాగుతుందని బాంబే హైకోర్టు ప్రకటించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం పై మొట్టికాయలు వేసిన హైకోర్టు ఐపీఎల్ నిర్వాహకులకు ప్లే గ్రౌండ్ నిర్వహణకు అవసరమైన నీరు కల్పించాల్సిందిగా కూడా సూచించింది. మహారాష్ట్రలో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. 70 శాతం ప్రాంతాలు కరవుతో మగ్గుతున్నాయి. మహారాష్ట్రలో మూడు నగరాల్లో అంటే ముంబై, పుణే, నాగపూర్ లో మొత్తం 20 ఐపీఎల్ టీ-20 మ్యాచ్ లు జరగాల్సి ది. ఏప్రిల్ 9న వాంఖడే స్టేడియంలో తొలిమ్యాచ్ జరగాల్సి ఉంది. ఐపీఎల్ షెడ్యూల్ ఎప్పుడో ప్రకటించినా.. మ్యాచ్ ల ప్రారంభానికి ఇక కేవలం 4 రోజులు ఉందనగా పిల్ దాఖలు చేయడంతో ఔన్యత్యాన్ని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రశ్నించింది. స్టేడియం నిర్వహణకు తాగడానికి పనికిరాని నీటిని తాము కొనుక్కుంటున్నామని ఎంసీఏ వెల్లడించింది. కాగా, ఈ నీరు పనికిరానిదా అన్న అంశాన్ని దర్యాప్తు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేవలం 22 వేల లీటర్లు స్టేడియానికి సరఫరా అయితే సరిపోతుందా అనే అంశంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more