ఐపీఎల్ లో కొత్త జట్లు అయిన పుణె, రాజ్ కోట్ లు ఆటగాళ్లను ఎంచుకున్నాయి. ముందు ఊహించినట్లుగానే టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తాజా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికాడు. తొలుత రూ.12.5 కోట్లకు మహేంద్ర సింగ్ ధోనిని పుణె ప్రాంఛైజీ కొనుగోలు చేయగా, అనంతరం సురేష్ రైనాను అదే ధరకు రాజ్ కోట్ దక్కించుకుంది. ఐపీఎల్ వేలంలో ధోని, రైనాలే ముందుగా అమ్ముడుపోయి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. కాగా, రవీంద్ర జడేజాను రూ.9.5 కోట్లకు రాజ్ కోట్ దక్కించుకుంది. మొత్తంగా తలా 66 కోట్ల రూపాయలను వెచ్చించిన ఇరు జట్లు ఐదేసి క్రికెటర్లను తమ జట్టు తరపున దక్కించుకుంది.
చెన్నై, రాజస్తాన్ జట్లకు గత సీజన్లో ఆడిన మొత్తం 50 మంది క్రికెటర్లు అందుబాటులో ఉండగా... నిబంధనల ప్రకారం ఈ రెండు జట్లు ఐదుగురేసి ఆటగాళ్లను మాత్రమే ఇప్పుడు ఎంచుకోవాల్సిఉంది. ఇంకా మిగిలిన 40 మంది క్రికెటర్లు ఫిబ్రవరిలో జరిగే వేలంలోకి వెళతారు. అక్కడ వీరితో పాటు మరింత మంది క్రికెటర్లు ఉంటారు. ఆ వేలంలో అన్ని జట్లూ పాల్గొంటాయి. సంజీవ్ గోయెంకాకు చెందిన కంపెనీ రివర్స్ బిడ్డింగ్ ప్రక్రియలో మైనస్ 16 కోట్ల రూపాయలతో జట్టును పుణేను గెలిచింది. రాజ్కోట్ను కొనుక్కున్న ఇంటెక్స్ మొబైల్స్ (మైనస్ 10 కోట్ల రూపాయలు) కంటే ఎక్కువ మొత్తం పుణే జట్టు చెల్లిస్తోంది. కాబట్టి తొలి ఆటగాడిని పుణే ఎంచుకోగా, రెండో క్రికెటర్ను రాజ్కోట్ దక్కించుకుంది.
పుణె ప్రాంఛైజీ ఆటగాళ్లు: ధోని(రూ.12.5 కోట్లు), అజింక్యా రహానే(రూ.9.5 కోట్లు), అశ్విన్(రూ.7.5 కోట్లు),స్టీవ్ స్మిత్(రూ.5.5 కోట్లు), డు ప్లెసిస్(రూ. 4 కోట్ల)
రాజ్ కోట్ ప్రాంఛైజీ ఆటగాళ్లు: సురేష్ రైనా(రూ.12. 5 కోట్లు), జడేజా(9.5 కోట్లు), మెకల్లమ్(రూ.7.5 కోట్లు), ఫాల్కనర్(రూ.5.5 కోట్లు), డ్వేన్ బ్రేవో(రూ.4 కోట్లు)
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more