టీమిండియాతో టీ20, వన్డే సిరస్ లను కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా అదే దూకుడుతో ముందుకు సాగుతూ.. మొహాలీ వేడుకగా ఇవాళ ప్రారంభమైన టెస్టు సిరీస్ తొలి వన్డేలోనూ జోరు కొనసాగించింది. మహాత్మాగాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లో భాగంగా తొలి టెస్టు మొదటి రోజు ఆటలో సఫారీలు పైచేయి సాధించారు. ఆరేళ్ల తరువాత సొంత గడ్డపై టీమిండియాను మట్టికరిపించారు. తొలిరోజే కోహ్లీ సేనను ఆలౌట్ చేసిన జట్టుగా కీర్తి గడించారు. తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత బ్యాట్స్ మెన్ ను సఫారీ బౌలర్లు ఏ దశలోనూ కుదురుకోనివ్వలేదు.
స్పిన్ కు అనుకూలంగా వున్న పిచ్ పై నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికా పేస్ బౌలర్లు సత్తాచాటరు. టీమిండియా టాపార్డర్ పని పట్టారు. మురళీ విజయ్, రవీంద్ర జడేజా కాస్త ప్రతిఘటించినప్పటికీ ఎదురుదాడికి దిగలేకపోయారు. దీంతో 210 పరుగులకే కోహ్లీ సేన అలౌట్ అయ్యింది. భారత బ్యాట్స్ మన్లలో మురళీ విజయ్ (75), ఛటేశ్వర్ పుజారా (31) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (1), అజింక్యా రహనే (15), వృద్ధిమాన్ సాహా (0), రవీంద్ర జడేజా (38), అమిత్ మిశ్రా (6), రవిచంద్రన్ అశ్విన్ (20), ఉమేష్ యాదవ్ (5), వరుణ్ ఆరోన్ (0) పరుగులకే వెనుదిరిగారు.
సఫారీ కొత్త బౌలర్ ఎల్గర్ నాలుగు వికెట్లు తీసి సత్తాచాటగా, ఫిలాండర్, తాహిర్ చెరి రెండు వికెట్లతో రాణించారు. వారికి హర్మర్, రబడా చెరో వికెట్ తో సహకరించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు 20 ఓవర్లలో వాన్ జిల్ (5), డుప్లెసిస్ (0) వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. క్రీజులో ఎల్గర్ (13), కెప్టెన్ హషీమ్ ఆమ్లా (9) ఉన్నారు. భారత్ స్కోరు దాటేందుకు సౌతాఫ్రికా 173 పరుగులు చేయాల్సిఉంది. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా చెరో వికెట్ సాధించారు. రెండవ రోజు పిచ్ స్పిన్ బాగా అనుకూలిస్తుందని భారత క్రికెట్ అభిమానులు అంచనా వేస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more