టీమిండియా వన్డే, టీ-20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో ప్రపంచ రికార్డును సాధించాడు. దక్షిణాఫ్రికాతో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరిగిన టి-20 మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైనా.. కెప్టెన్ ధోని మాత్రం రికార్డును సాధించాడు. అదేంటి అనుకుంటున్నారు. ఇటీవలే ప్రపంచ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఈ పోట్టి ఫార్మెట్ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోణి.. అర్థశతకం మ్యాచ్ లకు నాయకత్వం సారధ్యం వహించి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్లే ఈ మ్యాచ్ ను ఓడిపోయామని కూడా ఆయన చెప్పుకోచ్చారు.
మరోవైపు ఈ మ్యాచ్ లో చెలరేగి 62 బంతుల్లో సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మ భారత్ తరఫున టి20ల్లో సెంచరీ నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాబు. గతంలో రైనా కూడా దక్షిణాఫ్రికాపైనే శతకం బాదాడు. ఈ మ్యాచ్తో రోహిత్ మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన ఆటగాడయ్యాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన తొమ్మిదో బ్యాట్స్మన్. ఈ ఇన్నింగ్స్తో వన్డేలు, టి20ల్లోనూ అతను భారత టాప్స్కోరర్గా నిలిచాడు. ఇదిలావుండగా, రోహిత్, కోహ్లి నెలకొల్పిన 138 పరుగుల భాగస్వామ్యం టి20ల్లో భారత్కు అత్యుత్తమం. గతంలో గంభీర్, సెహ్వాగ్ (136) రికార్డును వీరు చెరిపేశారు. ఇక టి20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా నిలిచాడు విరాట్ కోహ్లి. ప్రపంచ క్రికెట్లో అందరికంటే తక్కువ ఇన్నింగ్స్లలో (27) అతను ఈ ఘనత సాధించాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more