తమ సత్తా చాటుదామని దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు వచ్చిన క్రికెటర్లు.. ఇక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతోపాటు ఫుడ్ పాయిజన్ కారణంగా కుప్పకూలిపోయారు. అది కూడా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పదిమంతి ఆటగాళ్లు ఆసుపత్రిపాలయ్యారు. ఈ విధంగా ఆ జట్టు ఆటగాళ్లకు భారీగా దెబ్బ పడటంతో చివరకు టీమిండియా సహాయం తీసుకోక తప్పలేదు. తమ తరఫున ఆడేందుకు ఓ ఆటగాడ్ని సబ్ స్టిట్యూట్ గా తీసుకున్నారు. ప్రస్తుతం 10 మంది ఆటగాళ్లు స్థానిక అపోలో ఆస్పత్రిలో ఉన్నారని దక్షిణాఫ్రికా బోర్డు అధికారిక ప్రకటన చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇండియా - దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే! ఈ సిరీస్ లో భాగంగానే దక్షిణాఫ్రికా-ఏ, భారత్-ఏ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతుండగానే 10 సఫారీ ఆటగాళ్లు కుప్పకూలిపోయారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే వీరంతా అనారోగ్య బారిన పడ్డారని తేలింది. భారత్తో వన్డేలో సెంచరీ చేసి 25 ఓవర్లపాటు ఫీల్డింగ్ చేసిన డి.కాక్ కూడా ఒక్కసారిగా ఆరోగ్యం దెబ్బ తినడంతో హాస్పిటల్ చేరాడు. అంతకుముందు స్వల్ప అనారోగ్యంతో మ్యాచ్ నుంచి దూరంగా ఉన్న ముగ్గురు క్రికెటర్లు.. ఇప్పుడు 10 మంది ఆటగాళ్లు అస్వస్థతకు గురికావడంతో వారు మైదానంలో దిగాల్సి వచ్చింది. అప్పటికీ ఆటగాళ్లు సరిపోకపోవడంతో.. భారత ఆటగాడు మన్దీప్ సింగ్ సౌతాఫ్రికా జెర్సీతో ఫీల్డింగ్ చేయడం విశేషం!
మరోవైపు.. ఆటగాళ్లంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో షెడ్యూల్ ప్రకారం సోమవారం ఆసీస్తో మ్యాచ్ ఆడలేమని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు ఆసీస్తో భారత్ బరిలోకి దిగేందుకు కోచ్ ద్రవిడ్ అంగీకరించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more