క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన వన్డేలో జరిగిన పూల్ బి మ్యాచ్ లో టీమిండియా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇవాళ యూఏఈతో జరిగిన మ్యాచ్ లో భారత్ 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యూఏఈ నిర్దేశించిన 103 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.5 ఓవర్లలో ధోని సేన ఛేదించి పసికూన యూఏఈపై 9 వికెట్లతో అలవోక విజయం సాధించింది. ప్రపంచకప్ లో గత రెండు మ్యాచ్ లలో రాణించని రోహిత్ శర్మ (57 నాటౌట్) హాఫ్ సెంచరీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. విరాట్ కోహ్లీ (33 నాటౌట), ధవన్ 14 పరుగులు చేశారు. ఓపెనర్ గా వచ్చిన శిఖర్ ధావన్ జట్టు స్కోరు 29 పరుగుల వద్ద ఉండగా 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యారు. మహ్మద్ నవీద్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి పెవీలియన్ దారిపట్టాడు.
ఆ ఆ తర్వాత రోహిత్, కోహ్లీ మరో వికెట్ పోకుండా జట్టును గెలిపించారు. అంతకుముందు భారత బౌలర్లు యూఏఈని 31.3 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌట్ చేశారు. యూఏఈ జట్టులో షైమన్ అన్వర్ (35) టాప్ స్కోరర్. అన్వర్తో పాటు ఖుర్రంఖాన్, గురుగె మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగిలినవారు సింగిల్ డిజిట్కే పెవిలియన్ బాట చేరారు. భారత బౌలర్లు అశ్విన్ 4, జడేజా, ఉమేష్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more