ప్రపంచ కప్ టార్నమెంటులో భాగంగా రేపు (ఆదివారం దక్షిణాఫ్రికా జట్టుతో జరగనున్న రెండో మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితమైనదని భారత్ వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డారు. భారత బ్యాటింగ్ కు సఫారీలో బౌలింగ్ కు మధ్య పోటీగా ఈ మ్యాచ్ నిలుస్తుందని ఆయన అభివర్ణించారు. ఆదివారం నాడు మెల్బోర్న్ క్రికెట్ గౌండ్స్ లో జరగనున్న భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్ లో ఇరుజట్లు సమాతుల్యతతోనే వున్నాయని, అయితే ఎవరు ఎలాంటి ఆటతీరును ప్రదర్శిస్తారన్న దానిపైనే విజయం అధారపడి వుంటుందని విరాట్ అభిప్రాయపడ్డారు.
సౌత్ అఫ్రికాతో మ్యాచ్ కు ముందు.. జట్టు సారధి మహేంద్ర సింగ్ దోణికి బదులుగా వచ్చిన కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యర్థి జట్టులో మంచి బౌలర్లు ఉన్నారు. అదీ కాక వారికి వారి బౌలింగ్ కు వర్ల్డ్ కప్ వేదికైన అస్ట్రేలియా, న్యూజీలాండ్ పిచ్ లు చాలా అనుకూలిస్తాయన్నారు. అదే విధంగా టీమిండియా బ్యాటింగ్లో పటిష్టంగా రాణిస్తోందన్నారు. సఫారీ ఆటగాళ్లలో డేల్ స్టెయిన్, ఏబీ డివిలియర్స్తో ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన అనుభవం టీమిండియాకు కలిసొస్తుందన్నారు. డేల్ తనకు మంచి మిత్రుడు. తామిమిద్దరం కలిసినప్పుడు ఆలింగనం చేసుకుంటామన్నారు. అయితే మైదానంలో మాత్రం ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికే ప్రయత్నిస్తామని చెప్పారు.
ప్రపంచ ఫాస్టెస్ట్ బౌలర్లలో డేల్ స్టెయిన్ ప్రమాదకరి బౌలర్ అని పేర్కోన్న కోహ్లీ, విధ్వంసకర బ్యాట్స్ మెన్లలో డివిలియర్స్ ఒకరని తెలిపారు.. అయితే అలాంటి జట్టును ఓడించేందుకు తమ జట్టు సమర్థంగా ప్రణాళిక వేసుకుందని, దాని ప్రకారం వెళ్తే విజయం వరిస్తుందని చెప్పారు.. మెల్ బోర్న్ గ్రౌండ్కు వచ్చే 80 వేల మంది ప్రేక్షకులల్లో 80 శాతం భారతీయ అభిమానులే. కనుక జట్టు మొత్తం సమర్థంగా సఫారీలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది" అని విరాట్ కోహ్లి అన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more