అస్ట్రేలియాతో మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడవ టెస్టులో భారత్ శుబారంభం చేసింది. మ్యాచ్ పై పట్టు బిగించాలని భావిస్తున్న టీమిండియా నెమ్మెదిగానే అడుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో ఒక్క విక్కెట్ నష్టానికి 108 పరుగులు చేసింది. మురళీ విజయ్, ఛత్తీశ్వర్ పూజారాలు తొలి రోజు భారత స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. అస్ట్రేలియా జట్టు అలౌట్ అయిన తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 55 పరుగుల వద్ద తొలి విక్కెట్ ను కోల్పోయింది.
ఓపెనర్ శిఖర్ ధావన్ (28) పరుగుల వద్ద అవుట్ కావడంతో అప్పటి వరకు దూకుడుగా ఆడిన భారత్.. నెమ్మెదిగా ఆటను కొనసాగించింది. అనంతరం మురళీ విజయ్ కి జతకలిసిన ఛటేశ్వర పూజారా భారత్ స్కోరు బోర్డును చక్కదిద్దే పనిలో పడ్డాడు. మరోసారి మురళీ విజయ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మురళీ విజయ్ (55), పూజారా (25) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. మూడో రోజు ఆటలో భారత్ మరింత కుదురగా ఆడితే ఆసీస్ కు ధీటైన జవాబిచ్చే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్ లో వున్న ఆటగాళ్లు రాణిస్తే.. మూడవ మ్యాచ్ పై పట్టుబిగించినట్లే.
అంతకుముందు మూడవ టెస్టు తొలిరోజు సాధించిన 259-5 ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన అస్ట్రేలియా స్పష్టమైన అధిక్యాన్ని కనబర్చింది. కెప్టెన్ స్మిత్ మరోసారి సెంచరీతో ఆకట్టుకోవడంతో అసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 530 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. స్మిత్ (305 బంతుల్లో 15 ఫోర్లు ; రెండు సిక్సర్లు)తో 192 పరుగులు చేశాడు. తొలిసారి డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయిన స్మిత్ కు ఆసీస్ ఆటగాళ్ల నుంచి చక్కటి మద్దతు లబించింది. కాగా చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more