ప్రపంచ కప్ ట్వంటీ-20 టోర్నమెంట్కు ముందు శ్రీలంకతో జరిగిన తొలి సన్నాహక మ్యాచ్లో ఓటమిని ఎదుర్కొన్న భారత జట్టు బుధవారం రెండో వామప్ మ్యాచ్లో విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంది.
ఇంగ్లాండ్తో జరిగిన ఈ మ్యాచ్లో యువ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, సురేష్ రైనా అర్ధ శతకాలతో రాణించి టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
దీంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు రోహిత్ శర్మ (5), శిఖర్ ధావన్ (14)తో పాటు యువరాజ్ సింగ్ (1) విఫలమవడంతో భారత జట్టు 39 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.
ఈ తరుణంలో విరాట్ కోహ్లీ, సురేష్ రైనా క్రీజ్లో నిలదొక్కుకుని ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించారు. చూడముచ్చటైన షాట్లతో అలరించిన వీరు చెరొక అర్ధ శతకాన్ని నమోదు చేయడంతో పాటు నాలుగో వికెట్కు 81 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు.
ఆ తర్వాత రైనా (54) రవి బొపారా బౌలింగ్లో జోర్డాన్కు క్యాచ్ ఇవ్వగా 48 బంతుల్లో 74 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ, కెప్టెన్ ధోనీ (21) కలసి అజేయంగా మరో 58 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది.
దీంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే రాబట్టిన ఇంగ్లాండ్ జట్టు 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు కైవసం చేసుకోగా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, సురేష్ రైనా ఒక్కో వికెట్ సాధించారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more