స్కాందపురాణంలో గణపతిని ఏ సందర్భంలో, ఎందుకు సృజించారో ఒక కథ రాయబడి వుంది. అదేమిటంటే...
పూర్వం మానవులు భోగభాగ్యాల జీవితాన్ని పొందాలనే ఆకాంక్షతో అందరూ స్వర్గంవైపుకు ఆకర్షితులయ్యారు. దీంతో మానవులు ఘోర తపస్సులు చేసి ఒక్కొక్కరు వెళ్లగా... రానురాను దేవలోకం నిండిపోయింది.
అలా అక్కడికి వెళ్లిన మానవులు ఊరుకోక.. ఏకంగా దేవతలమీదే పెత్తనం చెలాయించడం మొదలుపెట్టారు. మానవులు తమ ఇష్టం వచ్చిన విధంగా స్వర్గలోకంలో విహరించడం మొదలుపెట్టారు.
దీంతో మానవజాతిని చూసి దేవతలు భయానికి లోనయ్యారు. ఆ భయం రానురాను మరీ ఎక్కువవుతుండడంతో... ఒకరోజు దేవేంద్రుడు కైలాసానికి ప్రయాణం చేశాడు.
అక్కడికి చేరుకున్న దేవేంద్రుడు పార్వతీపరమేశ్వరుల దగ్గరకు వెళ్లి వాళ్లను మనస్పూర్తిగా భక్తిశ్రద్ధలతో నమస్కరించాడు. తరువాత ఆయన పార్వతీపరమేశ్వరులతో ఈ విధంగా చెప్పాడు...
‘‘పరమేశ్వరా! స్వర్గానికి చేరుకున్న మానవులు ఘోరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. వారు తమకు ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారు. రానురాను దేవలోకంలో వారి సంఖ్య మరీ ఎక్కువ అవుతోంది. అంతటితో ఊరుకోకుండా వారు దేవతలందరినీ అనేక రకాలుగా బాధిస్తున్నారు. ఈ బాధ నుంచి మమ్మల్ని కాపాడు తండ్రి!’’ అని వేడుకున్నాడు.
దేవేంద్రుడు చెప్పిన మాటలు విని పరమేశ్వరుడు ప్రశాంతంగా, చిరునవ్వుతో పార్వతీవైపు చూశాడు. అప్పటికప్పుడే పార్వతీదేవి మట్టీ తీసుకుని తన చేతులతో ఒక ఆకృతిని రూపొందిస్తుంది. దాని ముఖం ఏనుగుని పోలి, బొజ్జ ముందుకు పొడుచుకు వచ్చి, పెద్ద శరీరం కలిగి, నాలుగు చేతులతో ఒక వింత ఆకారంలో వుంది.
అలా ఆ విధంగా సృష్టించబడిన గణేశుడు ఎంతో వినయంతో పార్వతీదేవిని నమస్కరించి ఇలా చెప్పసాగాడు... ‘‘అమ్మా! నన్ను ఎందుకు సృష్టించారో కొంచెం విశదీకరించి చెబుతారా?’’
పార్వతీదేవి.. ‘‘నాయనా.. నీవల్ల కావలసిన పనులు చాలా వున్నాయి. నువ్వు వెంటనే భూలోకానికి వెళ్లు. అక్కడ ఎవరైతే మోక్షం పొంది, స్వర్గానికి వెళ్లాలనుకుంటున్నారో, వారిక విఘ్నాలు కలిగించు. ఈ విషయంలో నీకు నంది, మహాకాలుడు సహాయకులుగా వుంటారు’’ అని అంది.
అప్పుడు పార్వతీదేవి తక్షణమే తీర్థ, ఔషధాలతో గణేశునికి తానే స్వయంగా అభిషేకం చూయించింది. ఈ మొత్తం కార్యక్రమాన్ని చూస్తున్న మొత్తం 33 కోట్ల దేవతలు సంతోషంతో గణేశునికి ఆశీర్వాదాలు ఇస్తూ.. పూలు జల్లారు.
గణపతికి పరమేశ్వరుడు గొడ్డలిని, బ్రహ్మ త్రికాల జ్ఞానాన్ని, విష్ణుమూర్తి బుద్ధిని, కుబేరుడు ఐశ్వర్యాన్ని, సూర్యభగవానుడు ప్రతాపాన్ని, చంద్రుడు కాంతిని, పార్వతి మోదకపాత్రను, దేవేంద్రుడు సౌభాగ్యాన్ని ఇచ్చారు. గణేశుడికి వాహనంగా కార్తికేయుడు ఎలునకను ఇచ్చాడు. ఈవిధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క వరాన్ని ఇవ్వగా.. గణపతి బలశాలిగా రూపొందాడు.
ఈవిధంగా బలశాలిగా మారిన గణపతి.. పార్వతీదేవి ఆజ్ఞమేరకు భూలోకానికి వెళ్లి.. మోక్షం, స్వర్గలోకం ఆశించేవారికి విఘ్నాలు కలిగించాడు. దాంతో మానవులు స్వర్గలోకానికి వెళ్లడం తగ్గింది. అప్పటినుంచి గణపతి అంటే మానవలోకంలో అందరికీ భయం ఏర్పడింది. అందుకే ఏ పని మొదలుపెట్టినా మానవులు ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించుకుని అడ్డంకులు లేకుండా చూసుకుంటారు.
(And get your daily news straight to your inbox)
Nov 17 | ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు నమస్కరించుకోవడం భారతీయ సంస్కారం. ఇలా పలకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కో విధంగా వుంటుంది. అవి.. వారివారి సంస్కృతీసంప్రదాయాలు, నాగరికతపై ఆధారపడి వుంటుంది. అయితే.. ఈ పలకరింపులన్నింటిలో భారతీయులది... Read more
Nov 10 | ఏ దేవునికైనా సరే.. పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి ఆచారంగా మారిపోయింది. అయితే.. ఈ పుష్పాలు కచ్చితంగా ఎందుకు వినియోగించాలి..? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? అనే విషయాలు చాలామందికి... Read more
Nov 05 | గుడికి వెళ్లిన భక్తులు చాలామంది గుడివెనకున్న భాగాన్ని సైతం మొక్కుతుంటారు. ఇలా ఒక్క దేవాలయంలోనే కాదు.. ప్రతిఒక్క ఆలయంలోనూ భక్తులందరూ ఆచరిస్తారు. అయితే.. ఇలా చేయడం వెనుకగల కారణాలు చాలామందికి తెలిసి వుండదు. ఏదో... Read more
Oct 16 | పూర్వకాలంలో ఋషులు ఎక్కువకాలం ధ్యానంలోనే గడిపేవారు. అంటే తపస్సు చేస్తుండేవారు. ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రశాంత వాతావరణంలో కూర్చొని, దేవుడి నామాన్ని స్మరిస్తూ నిరంతర ధ్యానంలోనే వుండేవారు. ఇంతకీ ఈ తపస్సు వల్ల... Read more
Oct 09 | సాధారణంగా అన్ని దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేదా ఎక్కువ గంటలు వ్రేలాడ దీయబడి ఉంటాయి. భక్తుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట మ్రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి, ప్రార్ధనలకి ఉపక్రమిస్తాడు.... Read more