గ్వాలియర్ ఫోర్ట్
ఇండియాలోనే అతి పెద్ద చారిత్రక స్మారకం. ఇది గ్వాలియర్ నగరం మధ్యలో ఒక కొండపై వుంది. ఈ గ్వాలియర్ కోటను తోమార్ వంశానికి చెందిన రాజా మాన్ సింగ్ తోమార్ నిర్మించాడు. ఈ కోటను ‘జిబ్రాల్టార్ అఫ్ ఇండియా’ అని కూడా అంటారు. ఈ కోట వద్దే రాణి ఝాన్సి, తాంతియా తోపేలు బ్రిటిష్ వారితో యుద్ధాలు చేశారు.