సోమారామము
పంచరమాలలో రెండోదైన ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని బీమవరం పట్టణానికి 2 కి.మీ. దూరంలో ఉన్న గునిపూడిలో వుంది. ఇక్కడ స్వామివారు సోమేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడున్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం, అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులో మారుతుంది. తిరిగి పౌర్ణమికి మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఇక్కడ గల స్వామి వారిని చంద్రుడు ప్రతిష్టించాడు.