రోడ్డుమీదే తిండి
నిన్నటివరకు ఎంతో హాయిగా గుడిసెల్లోనే జీవితాన్ని సంతోషంగా గడిపిన ప్రజలందరూ.. హుధుద్ తుపాను ప్రభావంతో రోడ్డు మీదకు రావాల్సి వచ్చింది. పిల్లలకు, పెద్దలకు రోడ్డే భోజనశాలగా మారిపోయింది. తుపాను తాకిడికి, గాలుల అలజడికి గూడులన్నీ చెదిరిపోవడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో రోడ్డుమీద పడ్డారు.