రాజీవ్ చౌరస్తా వద్ద సైబరాబాద్ పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత అందరి కళ్లు దానిపై పడ్డాయి. పేలుళ్లకు ఎవరు కారకులన్న విషయం ఇట్టే తెలిసిపోతుందని భావించారు. ఆ కాసేపటికే అంతా నీరుగారిపోయారు. ఆ సీసీ కెమెరాలు పని చేయట్లేదంటూ పోలీసులు చావు కబురు చల్లగా చెప్పారు. నిఘా వ్యవస్థను పటిష్ఠం చేశామన్న పోలీసు శాఖ మాటలు డొల్లేనని ఈ సంఘటనతో తేలిపోయింది.కమిషనర్ వెళ్లిన అరగంటకే.. నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ గురువారం సాయంత్రం దిల్సుక్నగర్ చౌరస్తాలో ఉన్న సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరిగ్గా ఆయన వెళ్లిన అరగంటకే బాంబు పేలుళ్లు జరిగాయి. అమ్మోనియం నైట్రేటా... నైట్రో గ్లిజరినా...! పేలుళ్లకు కారణమెవరన్నది ఇంకా తెలియనప్పటికీ ఏఏ పదార్థాలను ఉపయోగించారన్న విషయంలో మాత్రం బాంబు స్క్వాడ్లు ఒక నిర్థారణకు వచ్చాయని తెలిసింది. రెండు చోట్ల అమ్మోనియం నైట్రైట్ లేక నైట్రో గ్లిజరిన్ ఉపయోగించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఇందుకు సంబంధించి 107 బస్టాప్ వద్ద, రమేష్ టీ కార్నర్ వద్ద సేకరించిన నమూనాలను బట్టి ఈ నిర్థారణకు వచ్చారని తెలుస్తోంది.రంగంలోకి మరిన్ని బృందాలు... పేలుళ్లు జరిగిన తర్వాత పోలీసు ఉన్నత అధికారులు హుటాహుటిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. రాష్ట్ర, సిటీ బాంబు డిస్పోజల్ స్క్వాడ్తో పాటు స్టేట్ ఇంటిలిజెన్స్ బ్యూరో, ఆక్టోపస్, నేషనల్ సెక్యూరిటీ గ్రూప్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, కౌంటర్ ఇంటిలిజెన్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. చెత్తకుప్పలతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని నమూనాలను సేకరించాయి. రాజీవ్ చౌక్ వద్ద జరిగిన పేలుళ్లలో కొన్ని ఇనుప ముక్కలను ఈ బృందాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. రెండు కమిషనరేట్లు.. రెండు ప్రాంతాలు... పేలుళ్లు జరిగిన రెండు ప్రాంతాలు రెండు కమిషనరేట్ల పరిధిలో ఉన్నాయి. 107 బస్టాప్ ప్రాంతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండగా రాజీవ్ చౌక్ ప్రాంతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. ఈ కేసులను రెండు కమిషనరేట్ల పోలీసులు దర్యాప్తు చేస్తారా.. లేక ఒకే దర్యాప్తు సంస్థకు అప్పగిస్తారా.. అన్నది తెలియాల్సి ఉంది. 107 బస్టాప్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి మలక్పేట పోలీసులు కేసు నమోదు చేయగా, రాజీవ్ చౌరస్తా వద్ద జరిగిన పేలుళ్ల కేసును సరూర్నగర్ పోలీసులునమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more