సచివాలయం ఎదురుగా గల విద్యారణ్య హైస్కూల్ ఆవరణలోని భూగర్భంలో గుప్త నిధులున్నాయన్న విషయం ఉత్కంఠ రేపుతోంది. ఈ విషయంపై పాఠశాల యాజమాన్యం అభ్యంతరం చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం సాయంత్రం తవ్వకాలను ప్రారంభించిన పురావస్తు శాఖ అధికారులు ఆదివారం కూడా తవ్వకాలను కొనసాగించారు. పాఠశాల ఆవరణలో బిర్లామందిర్ గుట్టకు ఆనుకుని క్రింది భాగంలో గుప్త నిధులకు సంబంధించి భూ గృహాన్ని తాము ఏడాది క్రితం చూసినట్టు చెబుతున్నకూలీలను అధికారులు ఇక్కడికి రప్పించారు.
కూలీలు చెబుతున్న అంశాలను బట్టి లోపల భూగృహ నిర్మాణాలున్నట్టు పురావస్తు శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.చెన్నారెడ్డి స్పష్టం చేశారు.అయితే తాము చేపట్టిన తవ్వకాలను పాఠశాల యాజమాన్యం అడ్డుకునేందుకు ప్రయత్నించడం పలురకాల అనుమానాలకు తావిస్తుందని ఆయన అన్నారు. పాఠశాల తరగతుల నిర్వహణకు ఎలాంటి అంతరాయం కలుగకుండా తవ్వకాలు చేపట్టినప్పటికీ యాజమాన్యం అభ్యంతరాలు చెబుతూ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. కొండ రాళ్లగట్టున తవ్వకాల పనుల్లో జాప్యం జరుగుతుండడంతో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఎక్స్ కవేటర్తో తవ్వకాలను వేగవంతం చేశారు. సోమవారం కూడా తవ్వకాలు కొనసాగిస్తామని ప్రకటించారు.గుప్త నిధులపై అనుమానాలు వనపర్తి సంస్థానాధిపతి రాజా రామేశ్వర్రావు ప్యాలెస్లో ప్రస్తుతం విద్యారణ్య హైస్కూల్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితం విద్యార్థుల క్రీడా అవసరాల కోసం ప్యాలెస్ భవనం-నౌబత్పహాడ్ కొండకు దిగువ భాగంలోని స్థలాన్ని చదును చేసి మైదానంగా అభివృద్ధి చేశారు. ఈ సమయంలో కూలీలు తవ్వకాలు జరుపుతుండగా కొండ కిందిభాగంలో గొయ్యి కన్పించిందని దాని దగ్గరగా వెళ్లగా లోపలికి వెళ్లడానికి మెట్లున్నట్టు చూసినట్టు కొందరు కూలీలు చెప్పారు. తర్వాత తామే మెట్లు దిగి వెళ్లి పరిశీలించగా ఇనుప తలుపు ఉందన్నారు. దానికి అతికష్టంతో రంధ్రం చేసి చూడగా సుమారు 12-10 అడుగుల వెడల్పు, పొడవులోని గదిలో విలువైన బంగారు ఆభరణాలు కన్పించినట్టు పేర్కొన్నారు. కూలీలు ఇచ్చిన సమాచారం ఆధారంగా కోల్ ఇండియా మేనేజర్ సీతారామరాజు స్వయంగా గుప్త నిధుల సొరంగాన్ని సుమారు ఆరు నెలల క్రితం పరిశీలించినట్టు పురావస్తు శాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా సమాచారం అందించారు.
ఈ మేరకు పురావస్తు శాఖ అధికారులు పరిశీలించి తవ్వకాలను ప్రారంభించారు. గత ఏడాది ఈ పాఠశాలకు రెండు వందల మీటర్ల దూరంలోనే ఉన్న సైఫాబాద్ హోం సైన్స్ కళాశాలలో భూగర్భ బంకర్ను ఆంధ్రజ్యోతి వెలికి తీసిన విషయం తెలిసిందే.ఈ బంకర్ నుంచి ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలోని భూగర్భ గృహానికి రహస్యమార్గం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నిజాం నవాబుకు- వనపర్తి సంస్థానాధిపతికి మధ్య ఉన్న సాన్నిహిత్య సంబంధాల దృష్ట్యా భూగర్భ గృహాలు నిర్మించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ప్రతినిధి వేదకుమార్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిజాం నవాబుల కాలంలో ఇలాంటి భూగర్భ గృహాలు పలుచోట్ల ఉన్నట్టు చరిత్ర చెబుతున్నట్టు ఆయన అన్నారు.ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో భూగృహం బయటపడితే మరింత చారిత్రక సమాచారం లభిస్తుందని అన్నారు. తవ్వకాలకు సంబంధించి ఇన్టాక్ హైదరాబాద్ కన్వీనర్ అనురాధా రెడ్డి స్పందిస్తూ... వనపర్తి సంస్థానాధిపతి కుటుంబంతో తమకున్న బంధుత్వంతో తరుచూ ఇక్కడికి వచ్చి వెళ్లేవారమని అన్నారు.భూ గృహం ఉందనే విషయం తమకు తెలియదన్నారు. తవ్వకాల్లో నిధులు బయటపడతాయన్నది నిజం కాదన్నారు. తవ్వకాల పనులు సాఫీగా సాగకుండా విద్యారణ్య స్కూల్ యాజమాన్యం అభ్యంతరాలు తెలుపడాన్ని బట్టి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు పురావస్తు శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more