ప్రతిష్టాత్మక ‘మెట్రో రైల్’ ప్రాజెక్ట్కు తరచూ రెడ్ సిగ్నల్ పడుతోంది. ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు అడుగడుగునా.. స్పీడ్బ్రేక్ పడుతోంది. పనులను వేగవంతం చేసేందుకు హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే గండి పడుతోంది. ఇప్పటికే నిర్వాసితుల సమస్యలు, పరిహారం పంపిణీ, మియాపూర్ భూములపై న్యాయపరమైన అభ్యంతరాలు ముసురుకున్నాయి. తాజాగా మూడో దశ అలైన్మెంట్ మార్పు న్యాయ వివాదంలో చిక్కుకుంది. అలైన్మెంట్ను మార్చడంపై పలువురు వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించడంతో.. తదుపరి కౌంటర్ దాఖలు చేసే వరకు తాత్కాలికంగా పనులను నిలిపివేస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి విన్నవించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి రెండో వారం నుంచి మొదలు కావాల్సిన పిల్లర్ల నిర్మాణం పనులు మరింత ఆలస్యం కానున్నాయి.
మూడో దశ వివాదం ఇదీ..
మెట్రో మూడో దశ (నాగోల్-శిల్పారామం) మార్గంలో.. బేగంపేట్ గ్రీన్ల్యాండ్ నుంచి శిల్పారామం వరకు నిర్మించనున్న లైనుపై స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రూటుకు సంబంధించి 2003లో రూపొందించిన మొదటి అలైన్మెంట్ ప్రకారం.. బేగంపేట్, పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, మాదాపూర్ మీదుగా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. పాత అలైన్మెంట్ ప్రకారం ఈ రూట్లో కేవలం 4 మలుపులు మాత్రమే ఉన్నాయి. కానీ, 2007లో అలైన్మెంట్లో మార్పులు చేశారు. గ్రీన్ల్యాండ్, అమీర్పేట్ చౌరస్తా, సారథి స్టూడియో, యూసుఫ్గూడ, కృష్ణానగర్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు మీదుగా శిల్పారామం వరకు లైను నిర్మించాలని ప్రతిపాదించారు. దీంతో మలుపుల సంఖ్య పెరగడమే కాకుండా, గ్రీన్ల్యాండ్ నుంచి కృష్ణానగర్ వరకు ప్రత్యక్షంగా 50 వేల కుటుంబాలపై మెట్రో ప్రాజెక్టు పెను ప్రభావం చూపనుంది.
ఒకప్పుడు 40 ఫీట్లతో లింక్రోడ్డుగా ఉన్న గ్రీన్పార్కు హోటల్ రోడ్డు ప్రస్తుతం 80 ఫీట్ల వెడల్పు ఉంది. అయితే అదనంగా మరో 20 ఫీట్లు మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం అవసరం ఉండడంతో.. తమ భవనాలు ఎక్కడ కూల్చివేస్తారోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇక్కడ మార్కింగ్ చేశారు. దీని ప్రకారం పనులు జరిగితేదాదాపు 165 భవనాలు నేలమట్టమవుతాయి.మధురానగర్, యూసుఫ్గూడ, కృష్ణానగర్ గుండా వెళుతోన్న రోడ్డు కేవలం 50 ఫీట్లు మాత్రమే ఉండడంతో అదనంగా మరో 50 ఫీట్ల వరకు విస్తరించాలి. రహదారులను విస్తరించిన పక్షంలో సారథి స్టూడియో నుంచి కృష్ణానగర్ వరకు దాదాపు 100 వరకు అపార్ట్మెంట్లు, 200 వరకు ఇండిపెండెంట్ గృహాలు కోల్పోవడం తథ్యం. దీనిపై బాధితులు న్యాయ పోరాటానికి సన్నద్ధమయ్యారు.
ప్రస్తుత పరిస్థితి ఇదీ..
నాగోల్-మెట్టుగూడ (మూడో దశ) మా ర్గంలో 8 కిలోమీటర్ల మేర పనులు చేపట్టేం దుకు అవాంతరాలు లేవు. ఈ మార్గంలో పనులకు ఆటంకం కలగకుండా వీధిలైట్లను పక్కకు మార్చారు. హైదరాబాద్ నాలాను విస్తరించారు. ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేశారు.ఉప్పల్లో మెట్రో రైలు డిపో నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది.మియాపూర్ ప్రాంతంలో భూసేకరణకు సంబంధించి గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ స్థానే మరో నోటిఫికేషన్ జారీ చేసేందుకు హైకోర్టు ఇటీవలే అనుమతిచ్చింది.చిక్కడపల్లి ప్రాంతంలో పరిహా రం పంపిణీలో పారదర్శకత లోపించిందని పలువురు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more