Arya to act as Villian in Allu Arjun starrer Pushpa మారేడుమిల్లి అడవుల్లోకి అల్లు అర్జున్ తో తలపడనున్న ఆర్య

Arya to feature in the upcoming allu arjun starrer pushpa

Allu Arjun, Sukumar, Arya, Vijay Sethupathi, villian role, Pushpa, allu arjun pushpa, sukumar allu arjun, allu arjun rashmika, Rashmika Mandanna, Devisri Prasad, Mahaboobnagar, kerala forest, movies, entertainment, tollywood

The latest news reports in the south film industry that Arya will be essaying a key role in the Allu Arjun starrer Pushpa. The news reports further state that this particular role was previously offered to the makkal selvan of southern film industry, Vijay Sethupathi.

అల్లు అర్జున్ తో మళ్లీ అమితూమి ఆర్య రెడీ మారేడుమిల్లి అడవుల్లోకి అల్లు అర్జున్ తో తలపడనున్న ఆర్య

Posted: 11/13/2020 10:56 PM IST
Arya to feature in the upcoming allu arjun starrer pushpa

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'లో ప్రతినాయకుడు ఎవరన్న విషయంలో రేగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడిందని సమాచారం, ఈ విషయంలో గత కోన్నాళ్లుగా కొనసాగుతన్న సస్పెన్స్ కు మరో తమిళస్టార్ చెక్ పెట్టాడు. ఓ వైపు హీరోగా పలు చిత్రాల్లో బిజీగా వుంటూనే ఇటు విలన్ పాత్రలోనూ ఒదిగిపోయేందుకు తాను రెడీ అంటున్నాడు. అంతేకాదు బన్నితో గతంలోనూ తాను ప్రతినాయకుడిగా తలపడ్డానని, ఇక అంతకుమించి ఈ చిత్రంలోనూ తాను తలపడతానని అంటున్నాడు. ఇంతకీ ఎవరీ హీరో అంటారా.. వరుడు చిత్రంలో విలన్ గా నటించిన ఆర్యనే ఈ చిత్రంలోనూ విలన్ గా కన్ఫాప్ అయ్యాడని టాక్.

ఈ ప్రతినాయకుడి పాత్రలో తొలుత తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తారని వార్తలు వచ్చాయి, అయితే డేట్స్ తరువాత సమస్య తలెత్తడంతో ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు, దీంతో పుష్ప చిత్రంలో ఎవరు ప్రతినాయకుడి పాత్రకు సెట్ అవుతారా.. అన్న ఉత్కంఠ కొనసాగింది. ఈ క్రమంలో పలువురు తమిళ నటులతో పాటు బాలీవుడ్ నటుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి, అయితే వరుడు చిత్రంలో విలన్ గా నటించిన ఆర్య.. బన్ని పుష్పలోనూ తలపడుతున్నట్లు.. వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వరుడు తర్వాత పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో ఆర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన విషయం తెలిసిందే.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ చిత్రం షూటింగును కేరళ అడవులలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో లాక్ డౌన్ విధింపుతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఇక పరిస్థితులు కుదుటపడటంతో ఈ చిత్రం షూటింగును తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో రెండు రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే. పలు కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు, అల్లు అర్జున్ సరసన రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని బాణీలను కూడా ఆయన సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. లారీ డ్రైవర్ గా వున్న పుష్ప ఎలాంటి పరిస్థితుల్లో చందనం స్మగ్లర్ గా మారారన్నదే చిత్రకథ. ఈ పుష్పరాజ్ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles