రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన స్టామినాను చూపించారు. పాన్ ఇండియా స్థాయిలో తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. సినిమా టాక్, క్రిటిక్స్ రేటింగ్తో సంబంధం లేకుండా తన సినిమా బాక్సాఫీసును షేక్ చేయగలదని ప్రూవ్ చేస్తున్నారు. రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ‘సాహో’.. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలిరోజు నెగిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్తో పాటు రెబల్ స్టార్ అభిమానులు భయపడ్డారు.
కానీ, ఆ భయాన్ని చీల్చుకుంటూ ‘సాహో’ దూసుకెళ్లింది. ‘సాహో’కి ఉన్న క్రేజ్తో తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయి. శుక్రవారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే, రెండో రోజు అంటే శనివారం కలెక్షన్స్ కాస్త తగ్గాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ.75 కోట్ల గ్రాస్ మాత్రమే ‘సాహో’ వసూలు చేసింది. అయితే, ఇదేమీ తక్కువేమీ కాదు. కాకపోతే, తొలిరోజుతో పోలిస్తే తక్కువగా కనిపిస్తుంది అంతే. శనివారంతో పోలిస్తే ఆదివారం కలెక్షన్లు పుంజుకున్నాయి. ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా రూ.89 కోట్ల గ్రాస్ వసూలైంది.
నాలుగో రోజు సోమవారం వినాయక చవితి కావడంతో కలెక్షన్లు బాగా పెరుగుతాయని అంతా ఆశించారు. కానీ, ‘సాహో’ అనుకున్న స్థాయిలో వసూలు చేయలేదు. సోమవారం కేవలం రూ. 36 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలైంది. మొత్తం మీద నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 330 కోట్లకు పైగా గ్రాస్ను ‘సాహో’ రాబట్టింది. ఈ మొత్తంలో సుమారు రూ.165 కోట్లు డిస్ట్రిబ్యూటర్ల షేర్ అని అంటున్నారు. కాగా బాలీవుడ్ లో మాత్రం సాహోకు వినాయక చవితి కలసిరాలేదు. అంతకుముందు మూడు రోజుల్లో వసూలు చేసిన మొత్తాని పరిగణలోకి తీసుకుంటే.. వినాయక చవితి రోజున అత్యంత కనిష్ట స్థాయికి వసూళ్లు పడిపోయాయి.
వాస్తవానికి నాలుగు రోజుల్లో రూ.330 కోట్ల గ్రాస్ అంటే తక్కువేమీ కాదు. ఇది కేవలం గ్రాస్ కాబట్టి ఇంకా సాహో చాలా వసూళ్లను రాబట్టాల్సివుంది. లాభాల విషయాన్ని పక్కనబెడితే.. కనీసం షేర్ అయినా రాబట్టాల్సిందే. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రూ.277 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ప్రస్తుతానికి రూ. 165 కోట్లు వచ్చింది. అంటే, డిస్ట్రిబ్యూటర్లకు ఇంకా 40 శాతం వరకు రికవరీ కావాల్సి ఉంది. అయితే రెండో వారాంతానికి వసూళ్లు రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు ఊరటనిస్తోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి, ఫుల్ రన్లో ‘సాహో’ ఎంత వసూలు చేస్తుందో చూడాలి.
తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’ 4 రోజుల షేర్ వివరాలు..
నైజాం - రూ. 23.30 కోట్లు
సీడెడ్ - రూ. 9.60 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ. 8 కోట్లు
గుంటూరు - రూ. 7.10 కోట్లు
తూర్పు గోదావరి - రూ. 6.40 కోట్లు
పశ్చిమ గోదావరి - రూ. 4.86 కోట్లు
కృష్ణా - రూ. 4.50 కోట్లు
నెల్లూరు - రూ. 3.59 కోట్లు
మొత్తం షేర్ - రూ. 67.35 కోట్లు
#Saaho collects in double digits on Day 4, aided by #GaneshChaturthi holiday [some parts of #India]... Mass centres strong... Tue-Thu biz crucial... #Saaho Fri 24.40 cr, Sat 25.20 cr, Sun 29.48 cr, Mon 14.20 cr. Total: ₹ 93.28 cr Nett BOC. #India biz. #Hindi version.
— taran adarsh (@taran_adarsh) September 3, 2019
The #SaahoStorm Continues #Saaho collects whopping 330 Cr+ gross in 4 days worldwide!
— UV Creations (@UV_Creations) September 3, 2019
Book tickets here : https://t.co/3g8zydBuXu #SaahoInCinemas pic.twitter.com/0IOsM6QrYJ
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more