తెలుగు చలన చిత్ర పరిశ్రమను కుదేలు చేసిన డ్రగ్స్ వ్యవహారంపై టాప్ హీరోలు నోరు మెదిపేందుకు ఆసక్తి చూపటం లేదు. ఏ మాట్లాడితే ఏం మెడకు చుట్టుకుంటుందో, అనవసరమైన గంపను తగిలించుకోవటం ఎందుకనో గప్ చుప్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి ఈ టాపిక్ పై స్పందించాడు. తన ట్విట్టర్ పేజీలో ట్వీట్లు చేశాడు.
కేసులో సిట్ విచారణ జరిగిన 12 రోజులు ఇండస్ట్రీకి చీకటి రోజులుగా వర్ణించాడు పవన్. తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాసిన లేఖలని తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. చలన చిత్ర కూటమి తరపున మీకు అప్పీల్ చేసుకుంటున్నామని ట్వీట్ చేశాడు పవన్. తెలుగు సినిమా 2000 కోట్ల రూపాయలు దాటిన సంతోషంలో(బాహుబలి 2 రికార్డు), ఒక తెలుగు దర్శకుడికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(కళాతపస్వి విశ్వనాథ్) వచ్చిన ఆనందంలో ఉన్న తెలుగు పరిశ్రమ ఓ వెలిగిపోతున్న సమయంలో కమ్మిన గ్రహణం మాదక ద్రవ్యాల కేసు అంటూ కేసీఆర్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ తమ లేఖలో పేర్కొంది.
— Pawan Kalyan (@PawanKalyan) August 2, 2017
An appeal to our Hon.Chief Minister of Telengana Sri.KCR Garu from Film Fraternity .. pic.twitter.com/o95gxzrVeu
— Pawan Kalyan (@PawanKalyan) August 2, 2017
ఈ మాదక ద్రవ్యాల కేసుని వెలుగులోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించాలని తెలుగు మూవీ ఇండస్ట్రీ లేఖలో పేర్కొంది. మే 7 తర్వాత ట్విట్టర్ అనివార్య కారణాలతో హ్యాక్ కాగా(బల్బ్ కామెంట్స్ సైడ్ చేసేందుకే డ్రామా ఆడుతున్నారనే టాక్ కూడా వినిపించింది), ఇప్పుడు తిరిగి ఓపెన్ కావటంతో పవన్ తిరిగి తన గళాన్ని వినిపించేందుకు సిద్ధం కాగా, యాంటీ ఫ్యాన్స్ ఆ పాత విషయాన్ని కెలుకుతున్నారు. అయితే చివరకు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే పలువురు కూడా డ్రగ్స్ పై స్పందించేందుకు ముందుకు రాని టైంలో పవన్ ఈ మాత్రమైనా స్పందించటం గొప్పే కాదంటారా?!
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more