గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కామెంట్స్ తో ఒక్కసారిగా టాలీవుడ్ లో తీవ్ర కలకలమే రేగింది. స్టార్ హీరోలను, అభిమానులను టార్గెట్ చేసి ఆయన తీవ్ర స్థాయి పదజాలంతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం కళారంగం జాతులు, కులాలు, వర్గాలు ఆధిపత్య పోరుతో చండాలంగా మారిందంటూ ఘాటు వ్యాఖ్యలే చేశాడు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే సినిమాలను చూస్తే కలెక్షన్లు రావని, అందరు అన్ని సినిమాలను ఆదరిం చాలని కోరారు. 50 ఏళ్ల నుంచి తాను 15 భాషల్లో పాటలు పాడుతున్నానని, ఇన్నేళ్లలో గమనించిన అంశం ఏంటంటే... భాషపై అంకితభావం లేనివారు తెలుగువారేనని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు సినిమా స్థాయిని ప్రజలే నిర్ణయించాల్సి ఉందంటున్నాడు.
‘‘లబ్దప్రతిష్టులయిన హీరోలు తెలుగు జాతి కోసం భాష గర్వపడేలా ఒక్క సినిమా తేయలేరా? ఎంత సేపూ కేరళ కర్ణాటక వాళ్లకు అవార్డులు వెళ్లిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారే కానీ.. ఎంత మంది తమ అభిమాన ఆర్టిస్టులను దేశం గర్వించే సినిమాలు తీస్తారా? అని ప్రశ్నించగలుగుతున్నారా? ‘దంగల్’ సినిమాను ఆమిర్ ఖాన్ ఒక్కడే చేయగలడా? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు.. అభిమాని ఆత్మ విమర్శ చేసుకోవాలి. మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషను సైతం విస్మరిస్తూ చిత్రాలు రావడం దురదృష్టకరమ ని చెప్పారు.
ఇక సినీ ప్రేక్షకుల పరిస్థితి సంకెళ్లు వేసుకున్న నపుంసకుల్లా మారిపోయింది. సినిమాల్లో నచ్చని అంశంపై నోరెత్తితే ఏ అభిమానులు వచ్చి ఇళ్లపై రాళ్ల వర్షం కురిపిస్తారోనని భయపడాల్సి వస్తోంది. తమ హీరోలకు జాతీయ అవార్డులు రావడం లేదని గోల చేసే అభిమానులు.. సోకాల్డ్ ఫ్యాన్స్.. ఆ స్థాయిలో సినిమాలు చేయడం లేదని ఎందుకు ప్రశ్నించరు? ఈ అభిమానులు తమ ఆర్టిస్టులను ప్రశ్నించగలిగిన రోజే జాతి గర్వించదగ్గ సినిమాలు వస్తాయి. అగ్ర కథానాయకులు కళాత్మక సినిమాలపై దృష్టి సారించాలి. హీరోలు కనీసం ఒక్క సినిమా అయినా జాతి భాష కోసం చేయాలని పిలుపునిచ్చాడు. ఓ కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కా రం అందుకున్న ఆయన పై వ్యాఖ్యలు చేశాడు.
కోలీవుడ్ ను చూసైనా కదలరేం-చలసాని
జల్లికట్టు క్రీడకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో అగ్ర సినీనటులు మొన్న జరిగిన ఆందోళనలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకహోదా కోసం సినీపరిశ్రమ మద్దతు తెలపాలని ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చాడు. తెలుగు సినీ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలను రాజకీయంగా, సినిమాల పరంగా ప్రజలు ఆదరించారని.. కానీ, సదరు హీరోలు మాత్రం రాష్ట్రం గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.
తమిళ సినీ నటులు ప్రజలకు అండగా నిలబడి పోరాడుతుంటే తెలుగు హీరోలు మాత్రం సినిమాలతో కోట్లు కొల్లగొట్టుకుపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జనసేనాని పవన్కల్యాణ్ ప్రత్యేక హోదా ఉద్యమానికి ముందుకు రావాలని ఆయన అన్నారు. కేంద్ర సర్కారు రాష్ట్రానికి ఇచ్చే ముష్టిని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోందంటూ తీవ్ర విమర్శలకు దిగాడు. కాగా, ట్విట్టర్ ద్వారా పోలవరం మీద వరుస ట్వీట్లు చేసిన ఆయన.. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ సాధన కోసం స్పందించాడు. రాజీ లేదు.. ఇక రణమే...
జల్లికట్టుపై పక్కనున్నతమిళనాడులో అక్కడి యూత్ మెరీనా బీచ్ దగ్గర చేసిన శాంతియుత నిరసన తెలుపుతున్న విషయం విదితమే. సోషల్ మీడియాతో జరిగిన ప్రచారంతో కేవలం 200 మంది మెరీనా బీచ్ దగ్గర మొదలెట్టిన నిరసన ఎంత పెద్దదిగా సాగి.. చివరకు కేంద్రం ఈ అంశంపై హుటాహుటిన ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా కోసం ఏపీ యువత ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో సైలెంట్ ప్రొటెస్ట్ (నిశ్శబ్ద నిరసన)కు ప్లాన్ చేసుకున్న పక్షంలో జనసేన వారికి మద్దతు ఇస్తుందన్న విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశాడు. అంతేకాదు ప్రత్యేక హోదా కోసం దేశ్ బచావ్ పేరిట మ్యూజిక్ ఆల్బమ్ రూపొందించిన జనసేన ఫిబ్రవరి మొదటి వారంలో దానిని విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే దానిని ఈనెల 24నే విడుదల చేయనున్నట్లు పవన్ తెలిపాడు. సమకాలీన రాజకీయాలు ఎంత నేర ప్రవృత్తితో కూడుకుని ఉంటున్నాయో, అవకాశవాద నేతల తీరును ఎండగడుతూ ఏపీ హోదా అంశాన్ని అందులో హైలెట్ చేశారంట.
#APDemadsSpecialStatus,I had planned a Musical protest album#DeshBachao to be released on 5th Feb but will prepone its release to 24th Jan.
— Pawan Kalyan (@PawanKalyan) January 22, 2017
JanaSena raises its 'Voice against Opportunistic,Divisive & Criminal
— Pawan Kalyan (@PawanKalyan) January 22, 2017
Politics;through a Protest Musical album"#DeshBachao !"
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more