టాలీవుడ్ లో ఒకప్పుడు తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన పంజాబీ బ్యూటీ ఛార్మీ.. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్లపాటు చెలామణి అయ్యింది. అయితే.. కాలక్రమంలో కొత్త హీరోయిన్ల హవా కొనసాగిన నేపథ్యంలో ఈమె ఇమేజ్ ఒక్కసారిగా పడిపోయింది. అయినప్పటికీ ఈమె ఏమాత్రం వెనక్కు తగ్గకుండా బరువైన పాత్రలను సైతం సమర్థవంతంగా పోషిస్తూ సినిమాలను రాణిస్తోంది. అందుకు ఉదాహరణగా ‘మంత్ర’ సినిమానే తీసుకోవవచ్చు. హార్రర్ కథాంశంతో తెరకెక్కిన ఆ మూవీలో ఛార్మీ తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక ‘మహా మహా’ పాట అప్పట్లో ఎంతో పాపులర్ అయ్యింది. ఆ పాట చార్మీ క్రేజ్ ని ఒక్కసారిగా పెంచేసింది.
కానీ.. ఆ తర్వాత ఈ అమ్మడు నటిగా తనను తాను నిలదొక్కుకోవడానికి, తన ఇమేజ్ మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే వుంది కానీ.. ఇంతవరకు ఫలితం దక్కలేదు. నేటి స్టార్ హీరోయిన్లకు పోటీగా ఈమె నిలవలేకపోతోంది. అందంతోపాటు నటనాప్రతిభ వున్నప్పటికీ.. ఈమెకి అదృష్టం కలిసి రావడం లేదు. ప్రస్తుతం పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణదశలో వున్న ఆ సినిమా షూటింగ్ త్వరలో ముగించి విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆ విషయాలు కాస్త పక్కనపెడితే.. తాజాగా ఛార్మీ తన ఇమేజ్ ని మరింతగా పెంచుకోవడం కోసం ఓ జిమ్మిక్కు ప్లే చేస్తోందని ఇండస్ట్రీవర్గాల సమాచారం!
వివరాల్లోకి వెళ్తే.. ఛార్మీ ప్రధానపాత్రలో ‘మంత్ర2’ సినిమాలో నటించనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! ఈ మూవీ త్వరగా షూటింగ్ ముగించేసుకుని, ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా వుంది. హారర్ తో కూడుకున్న సస్పెన్స్ నేపథ్యంలో కొనసాగే ఈ మూవీ ‘మంత్ర’కి సీక్వెల్ కాదు. ఆడియెన్స్ లోకి త్వరగా వెళ్లడం కోసం ఈ టైటిల్ ని వాడుకున్నారు. శౌరిరెడ్డి, యాదగిరిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్.వి.సతీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే.. గతంలో ఛార్మీ క్రేజ్ ని అమాంతం పెంచేసిన ‘మంత్ర’లోని ‘మహా మహా’ పాటలాగే ‘మంత్ర-2’లోనూ ప్రత్యేక పాటను ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ సాంగ్ ని ఆమెపై ఇటీవల సారథీ స్టూడియోలో చిత్రీకరించారు.
ఈ ప్రత్యేక గీతానికి భాస్కరపట్ల లిరిక్స్ సమకూర్చగా.. సునీల్ కాశ్యప్ స్వరపరిచాడు. ప్రేమ్ రక్షిత్ నృత్యదర్శకత్వంలో విభిన్నమైన సెట్స్ లో ఈ పాటని చిత్రీకరించారు. ఇంకో విషయం ఏమిటంటే.. ఈ పాటతోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం ముగిసింది. ఈ ప్రత్యేక పాట సినిమాకి హైలెట్ గా నిలవడంతోపాటు ఛార్మీ క్రేజ్ ని అమాంతంగా పెంచేయడం ఖాయమని యూనిట్ బృందం తెలుపుతోంది. ఇక ఈ మూవీ ఆడియోని మే మొదటివారంలో విడుదల చేసి.. ఆ తర్వాత త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి.. ఈ పాట ఛార్మీ క్రేజ్ ని ఏ మేరకు పెంచుతుందో తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more