ఏదైనా ఒక సినిమా హిట్ అయితే చాలు.. దానికి సీక్వెల్’గా మరో మూవీ రావడం ఇటీవలే కామన్ అయిపోయింది! ఇలా సీక్వెల్ తీయడం వల్ల మొదటి చిత్రం క్రేజ్’తోనే ఈ రెండో మూవీ కూడా సంచలన విజయం సాధించడంతోపాటు భారీ వసూళ్లను రాబడుతుందనే నమ్మకంతో ఇలా అందరూ ఈ ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు. ఇప్పుడు ఇదే కోవలోనే త్రివిక్రమ్ - మహేష్ ఇద్దరూ సంయుక్తంగా కలిసి పయనిస్తున్నారనే వార్తలు టాలీవుడ్’లో జోరందుకున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్’లో వచ్చిన ‘అతడు’ మూవీని ఇప్పుడు సీక్వెల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ప్రచారాలు కొనసాగుతున్నాయి.
మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అతడు’ చిత్రం క్లాసికల్ హిట్’గా నిలిచిన విషయం తెలిసిందే! అందులో మహేష్ తన నటనతో మెస్మరైజ్ చేస్తే.. త్రివిక్రమ్ తన మాటల మాంత్రిత్వంతో ఆ మూవీకి అట్రాక్టివ్ డైలాగులు అందించాడు. నిజానికి ఈ మూవీకి సీక్వెల్ తీస్తున్నట్లుగా గతంలో ఎవ్వరూ ప్రకటించలేదు. నిర్మాతగానీ, త్రివిక్రమ్ గానీ, హీరోగానీ ఎవ్వరూ ఆ మూవీకి సీక్వెల్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించలేదు. అయితే.. తాజాగా ఈ ఏడాది హారికా అండ్ హాసిని బ్యానర్ పై వీరిద్దరి కాంబినేషన్’లో రూపొందే మూవీకి ‘పార్థు’ అనే టైటిల్’ని ఫిక్స్ చేసినట్లు సమాచారం! ఆ టైటిల్ వల్లే ఇప్పుడు ఈ సీక్వెల్ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
ఎందుకంటే.. ‘అతడు’ చిత్రంలో మహేష్ పేరు ‘పార్థు’ అని వుంది. ఇప్పుడు రూపొందబోతున్న తాజా చిత్రానికి అదే టైటిల్ ఖరారు చేయడంపై ఈ మూవీ ‘అతడు’ చిత్రానికి సీక్వెల్ అయి వుండవచ్చునని చెప్పుకుంటున్నారు. ఈ ‘పార్థు’ చిత్రంలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ ‘అతడు’ మూవీలో వున్నట్లుగానే కొనసాగించవచ్చునని అంతా చెప్పుకుంటున్నారు. కానీ.. ‘అతడు’ మూవీలో ప్రేమకథతోపాటు, హీరో కథ కూడా సుఖాంతం అయ్యింది కాబట్టి.. ఈ ‘పార్థు’ చిత్రం అందుకు సీక్వెల్ అయ్యే అవకాశం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ రూమర్లపై క్లారిటీ రావాలంటే.. దర్శకనిర్మాతలే స్వయంగా అధికారికంగా వెల్లడించాల్సి వుంటుంది.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more