టాలీవుడ్ లో మూడు పేర్ల మద్య చాలా తేడా ఉందని అందరు అంటారు. ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరోకరు ప్రిన్స్ మహేష్ బాబు, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ ముగ్గురు చూట్టే .. టాలీవుడ్ లో పుకార్లు నడుస్తాయి. అందుకే వీరినే మీడియా వారు టార్గెట్ చేస్తారు. అంటే మిగత హీరోలను పట్టించుకోరని కాదు.
ముందుగా ఈ ముగ్గురికి ఉన్న డిమాండ్ ను ద్రుష్టిలో పెట్టుకోని.. మీడియా వారు ప్రవర్తిస్తారు. గతంలో పవన్ కళ్యాణ్ మీద, దర్శకుడు పూరి జగన్నాథ్ పై అనేక పుకార్లు పుట్టాయి. ఆ పుకార్లు ఎలా పుట్టాయో ఎవరికి అర్థం కాలేదు.
ఆ సమయంలో పూరి గానీ, పవన్ కళ్యాణ్ ఆ పుకార్ల పై ఎలాంటి మీడియా ప్రకటన చేయకపోవటంతో సినీజనాలు వాటికి ప్రాణం పోసి పెంచుకుంటున్నారు. అయితే ఇక అలాంటి పుకార్ల పై దర్శకుడు యాసిడ్ చల్లి.. నిజాన్ని బయట పెట్టారు.
పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అయినా పూరి పవన్ కాంబినేషన్ లో వచ్చిన బద్రి సినిమా ను పవన్ అభిమానులు ఇప్పటికి మర్చిపోలేరు .
మళ్ళి అటువంటి రికార్డు పవన్ తో క్రియేట్ చేద్దామని దర్శకుడు పూరి కెమెరా మెన్ గంగ తో రాంబాబు సినిమా ద్వారా ప్రయత్నించినా ఆ ప్రయోగం విజయవంతం కాలేదు . ఈ సినిమా తరువాత వీరిద్దరి బంధం ఫై రకరకాల వార్తలు కూడా వచ్చాయి.
ఆ మధ్యన పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాథ్ మధ్యన విభేధాలు వచ్చాయంటూ మీడియాలో వరసగా వార్తలు కూడా వచ్చాయి అయితే ఈ విషయాల ఫై పూరి నిన్న ప్రసారం అయిన ఒక ప్రతిక చానెల్ ఓపెన్ హార్ట్ ప్రోగ్రాం ను బాగా ఉపయోగించుకున్నాడు. అసలు ఈ విభేధాల వార్తలు అ ఎలా పుట్టుకు వచ్చాయో కూడా వివరించాడు పూరి.
తాను 'ఇద్దరమ్మాయిలతో..' సినిమా ప్రమోషన్ కోసమని ఛానెళ్లలో ఇంటర్వ్యూలిస్తున్న సమయం లో ఒక కాలర్ 'పవన్తో సినిమా వచ్చే ఏడాది ఉంటుందా..' అంటే 'ఉండచ్చు..' అన్నానని, దాన్ని పట్టుకొని మరో కాలర్ 'అందులో హీరోయిన్ ఎవరు..' అంటూ వరస పెట్టి అదే కార్య క్రమంలో ఒక పది ప్రశ్నలు ఇలా పవన్ సినిమా గురించే రావడం తో ఆ రోజు ఛానళ్లలో పవన్తో తాను చేయబోయే సినిమా అనేది హాట్ టాపికై కూర్చుంది అని చెప్పాడు పూరి.
ఆ తరువాత తనను దక్కన్ క్రానికల్ వాళ్లొచ్చి కొత్త సినిమాలో పవన్ ను ఎలా చూపిస్తారు? అని ఆడిగే సరికి విసుగొచ్చి పవన్ తో సినిమా అయినప్పుడు చూద్దాం అని చెప్పానని, దానికి అనేక అర్ధాలు తీస్తూ తనకు పవన్ కు భేదాభిప్రాయాలు వచ్చాయి.
అంటూ మీడియా రకరకాల కధనాలు రాసింది అంటూ, పవన్ కు తనకు వచ్చిన భేదాభిప్రాయల రూమర్లు మీడియా సృష్టి మాత్రమే అంటూ మరో కొత్త ట్విస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు పూరి.
ఇదే కార్య క్రంలో మట్లాడుతూ పూరి తాను ఒక సందర్భం లో ఏకంగా 85 కోట్లు డబ్బు పోగొట్టుకున్నాని చెప్తూ.. అంత డబ్బు పోతే ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్తారు అని అంటూ కానీ తాను ఆ పరిస్థితులను ఎదిరించి నిలదోక్కుకున్నానని వివరించాడు పూరి.
ఇదే సందర్భం లో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా గురించి మాట్లాడుతూ నిజానికి పోకిరి తర్వాత మూడేళ్ల పాటు ఏ సినిమా తీసినా 'పోకిరిలా లేదు..' అనడం మొదలెట్టారు అని అంటూ,. అసలు అంత బాగా నేనేం తీశానా అని మళ్లీ ఆ సినిమా ను ఎన్ని సార్లు తాను చూసినా నిజం గా పోకిరి సినిమా లో అంత ఏమి బాగుందో తనకు ఇప్పటికీ అర్ధం కాని నిజం అంటూ మరో బాంబు పేల్చాడు పూరి జగన్నాథ్ . పూరి పేల్చిన బాంబు దెబ్బ మహేష్ బాబు అభిమానులు తాకినట్లు సమాచారం.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more