డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు వెండి తెర పై నటిగా, నిర్మాతగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈమె ఇటీవల నటించి, నిర్మించిన ‘గుండెల్లో గోదావరి ’ చిత్రం ఇటీవలే విడుదల అయిన సంగతి తెలిసిందే. తెలుగు మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని తమిళ్ వెర్షన్లో 'మరంతన్ మణిత్తన్' పేరుతో ఈ 22న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసిందట లక్ష్మీ. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసిన రజినీ లక్ష్మి నటన, పని తనాన్ని తెగ మెచ్చుకున్నాడట. ఈ సినిమాలోని నటన సహజత్వాన్ని రజినీ బాగా మెచ్చుకున్నాడని చెబుతూ మెళికలు తిరిగిపోతుందట. రజినీ ప్రశంస తరువాత ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఏర్పడిందని లక్ష్మీ అంటుంది. అయితే సినీ జనాలు మాత్రం కేవలం హైప్ కోసమే ఇలా ప్రచారం చేసుకుంటుందని, తెలుగులో అంతంత మాత్రంగానే ఆడిన ఈ సినిమా అక్కడ ఏ విధంగా ఆడుతుందో చూడాలి అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more