టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు అయిన ఎం.ఎస్. రాజు తాజాగా రంభ ఊర్వసి మేనక (ఆర్ యు ఎమ్) అనే సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రూపు దిద్దు కోబోతుంది. ఈ చిత్రంలో ప్రధాన కథానాయికగా త్రిషను ఎంపిక చేశారు. మిగతా ఇద్దరిలో ఒక్కరిగా 'అవును' ఫేం పూర్ణ ఇప్పటికే సెలెక్ట్ అవగా, తాజాగా మరో కథానాయిక పాత్రకు హీరోయిన్ అర్చనను తీసుకున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా అవకాశాలు లేకుండా ఉన్న అర్చనను ఈ అవకాశం వరించడం ఆమెకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. కథానాయిక ప్రధాన చిత్రంగా రూపొందే ఈ చిత్రం కోసం 'రమ్' (RUM) అనే టైటిల్ని నిర్మాత ఫిలిం చాంబర్లో ఇప్పటికే రిజిస్టర్ చేశారు. ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఎమ్మెస్ రాజుకి ఈ సినిమా విజయం ఎంతో కీలకం. మరి ఈ రమ్ చిత్రం ప్రేక్షకులను మత్తెక్కిస్తుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more