Bollywood news

bollywood news, devaraya audio launch, life is beautiful ragilindi telangana amala paul

bollywood news

20.gif

Posted: 09/12/2012 09:07 PM IST
Bollywood news

pawan_5      *పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం శ్రీకాంత్ నటిస్తోన్న దేవరాయ ఆడియో వేడుకలో పాల్గొన్నారు. అక్కడ వచ్చిన ప్రేక్షకులంతా పవన్ పవన్ అంటూ అరుస్తూ హాల్ మొత్తం కోలాహలం గావించారు. ఇక్కడ కనిపిస్తున్న పవన్ స్టిల్ ఆడియో ఫంక్షన్ లోదే.. ఇక పవన్ నటిస్తున్న ‘ కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలోని ఒక పాటని ఇవాళ పద్మాలయా స్టూడియోలో చిత్రీకరించారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రెండు పాటల మినహా ఈ చిత్ర టాకీ పార్ట్ పూర్తయ్యింది. మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు.pawan_6.1
      ** పూరీ బన్నీ కాంబీలో వస్తోన్న ఇద్దరమ్మాయిలు సినిమాలో ఒకరు  తాప్సీ కాగా, రెండవ కథానాయికగా అమలా పాల్ ని తీసుకోనున్నారు. ప్రస్తుతం అమలా పాల్ తన సినిమా షూటింగ్ నిమిత్తం అవుట్ డోర్ లో ఉన్నారు, అందుకని పూరి అమలా పాల్ కి ఒక ట్వీట్ పోస్ట్ చేసారు ‘ షూటింగ్ పూర్తి చేసుకుని త్వరగా రండి. రాగానే కథ చెబుతాను మరియు నా టీం అంతా కూడా నీతో పనిచెయ్యాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారని’ పూరి ట్వీట్ చేసారు. ఈ విషయం పై స్పందించిన అమలా పాల్ ‘ మీతో పని చెయ్యడం నాకు చాలా ఆనందంగా ఉంది మరియు నేను కూడా మీతో పనిచెయ్యాలని అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన డాన్స్ చేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలు అని’ ఆమె సమాధానం ఇచ్చారు.
      *** వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన ‘ఏమైంది ఈ వేళ’ సినిమా కుర్రకారుకు బాగా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా పెద్దలను ఆకట్టుకోకపోయినా అబ్బాయిలకు మాత్రం బాగా నచ్చింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతుంది. శ్రీ కుమార స్వామి ప్రొడక్షన్స్ బ్యానర్ పై భాను శంకర్ అనే నూతన దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
     amala_paul **** తెలంగాణ ఉద్యమంపై మరోచిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ ఉద్యమంలో విద్యార్థులే కీలకమంటూ "రగిలింది తెలంగాణ" అనే చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. యాదగిరిగుట్టలోని సురేంద్ర పురి వద్ద ఈ చిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చిత్రంలో సుమన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హీరో సంపత్ రాజ్ , హీరోయిన్ పరిణితిపై మొదటిషాట్ కు కెమెరా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుపుతున్నారు.
    ***** శేఖర్ కమ్ముల తన రాబోయే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్ర ప్రమోషన్ పనుల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎంతో వినూత్నంగా అవుట్ డోర్ ప్రమోషన్స్ చేస్తున్నారు, అలాగే వరుసగా టాక్ షో లలో మరియు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. చిన్న చిన్న ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ కి పోస్టర్లని మరియు స్పీకర్లని అమర్చి సిటీ మొత్తం ప్రచారం చేయిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Survey on cine stars
Surya remuneration is high  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles