అధినాయకుడు బాలారిష్టాలు దాటి మొత్తం మీద తెరపైకి వచ్చేందుకు సమాయత్తమవుతున్నాడు. ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుంచి బైటపడిన 'అధినాయకుడు' ఈ నెల 31 న ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో జయసుధ, లక్ష్మీరాయ్, సలోని కథానాయికలుగా కనిపించనున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం.ఎల్.కుమార్ చౌదరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. అయితే అనుకోకుండా బడ్జెట్ పెరిగిపోవడంతో, నిర్మాత ఆర్ధిక పరమైన ఇబ్బందుల్లో పడ్డారు. ఫలితంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ అభిమానుల సహనాన్ని పరీక్షించింది. అయితే, తాజాగా అందిన సమాచారం ప్రకారం, దాసరి నారాయణరావు జోక్యంతో ఈ సినిమా ఆర్ధిక పరమైన సమస్యల నుంచి బైటపడిందని తెలుస్తోంది. అనుకోకుండా జరిగిన ఆలస్యం ఈ సినిమా పై ప్రభావం చూపే అవకాశముందనీ, ఒకవేళ సినిమా బాగుంటే ఆ ఎఫ్ఫెక్ట్ అంతగా ఉండక పోవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా చిత్ర నిర్మాతను కష్టాల కడలినుంచి బయటపడేస్తుందో లేదో చూడాలి.
..avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more