చైనాకు చెందిన ప్రఖ్యాత స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి అనుబంధ సంస్థ ‘పోకో’ తన తొలి స్మార్ట్ ఫోన్ ను భారత విఫణీలోకి ఇవాళ విడుదల చేసింది. అత్యంత అధునాతన ఫీచర్లు కలిగిన ఈ మోబైల్ ను అత్యంత ఆకర్షణీయంగా అందుబాటు ధరలో విడుదల చేసింది షియోమి. 845 స్నాప్ డ్రాగన్ తో విడుదలైన ఈ ఫోన్ పెర్ఫర్మెన్స్ స్పీడ్ అధికంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. లిక్విడ్ కూల్ టెక్నాలజీ వాడటం వల్ల ఫోన్ లోని వేడిని ఎప్పటికప్పుడు తగ్గించి, డివైస్ ను కాపాడుతుందని ఓ ప్రకటనలో పేర్కొంది.
4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో విడుదలైన ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ కలిగివుంది. అంతే కాకుండా ఈ ఫోన్లో ఇంటర్నట్ స్టోరేజిని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవడం అదనపు ఆకర్షణ. ఇండియా మార్కెట్లో సరికొత్త రికార్డులు సృష్టించనుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఈ ఫోన్ ప్రారంభ ధరను రూ.20,999 గా నిర్ణయించారు. 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999గా నిర్ణయించింది.
కాగా 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999.. అలాగే 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999గా కంపెనీ నిర్ణయించింది. హెచ్డీఎఫ్స బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై కొనుగోలు చేసే వారికి రూ.1000 రాయితిని ప్రకటించింది. ఈఎమ్ఐపై కొనుగోలు చేసే వారికి కూడా ఇది వర్తించనుంది. అంతే కాకుండా జియో కస్టమర్లకు రూ.8000 విలువ చేసే 6టీబీ డాటా, క్యాష్ బ్యాక్ ను అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ నెల 29 మద్యాహ్నం 12 గంటలకు ఎమ్ఐ.కామ్, ఫ్లిప్ కర్ట్ లలో మొదటి సేల్ ను నిర్వహిస్తారు.
ఫీచర్స్:
6.18 అంగుళాల డిస్ప్లే
ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1
6జీబీ/8జీబీ ర్యామ్
64జీబీ/128జీబీ/256జీబీ ఇంటర్నల్ మెమోరి
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫ్రంట్ కెమెరా 20 ఎంపీ సెల్ఫీ కెమెరా
12+5ఎంపీ మెయిన్ కెమెరా
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more