చైనా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు, రూపాయి విలువ పతనం అవుతున్న క్రమంలో ఇక బంగారం వెండి ధరలు పైపైకి ఎగబాకడం ఖాయంగా కనబడుతోంది. ఒక్క రోజులోనే వెయ్యి రూపాయల పైచిలుకు ఎగబాకిన బంగారం ధర.. రానున్న రోజుల్లో సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయి పతనం నేపథ్యంలో స్టాక్ మార్కెట్ నష్టాలలో కూరుకుపోతున్న క్రమంలో ఇక బంగారం, వెండీలపైనే తమ పెట్టుబడులు పెట్టాలని మదుపరులు నిశ్చయించుకోవడంతో పసిడి ధరలకు అమాంతం రెక్కలు రావడం ఖాయంగా తెలుస్తోంది. ఇందుకు గత వారం రోజులుగా ముంబై బులియన్ మార్కెట్లో నమోదవుతున్న ధరలు కూడా ఊతమిస్తున్నాయి.
క్రితం రోజున 24 క్యారెట్లు 10 గ్రాముల ధర అంతకు ముందురోజు ధరతో పోల్చితే రూ.495 పెరిగి రూ.26,995కు చేరింది. 22 క్యారెట్ల ధర కూడా అంతే స్థాయిలో ఎగసి రూ.26,845కు ఎగసింది. జూన్ 19 తరువాత రేట్లు ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. ఇక కేజీ వెండి విషయానికి వస్తే- రూ.240 పెరిగి రూ.37,035కు చేరింది. ఈ రేటు కూడా రెండు నెలల గరిష్ట స్థాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల పెరుగుదల ధోరణి, దేశంలో స్టాకిస్టుల డిమాండ్ పెరగడం వంటి కారణాలు పసిడి పరుగుకు కారణం. తాజా సమాచారం అందే సరికి నెమైక్స్ కమోడిటీ మార్కెట్లో పసిడి ధర (ఔన్స్ 31గ్రా)లాభాల్లో 1,160 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధర శుక్రవారం కూడా భారీ లాభాలతో కడపటి సమాచారం అందే సరికి రూ.27,290 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా రూ.100కుపైగా లాభంతో రూ.36,201 వద్ద ట్రేడవుతోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more
Jul 15 | రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నట్టు ఇవాళ ప్రకటించింది. జియో ప్లాట్ ఫామ్స్ లో భాగంగా జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లను తీసుకొస్తున్నట్టు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్... Read more