‘సుందరదాసు’ బిరుదు పొందిన ఎమ్మెస్ రామారావు.. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. ఈయన తన మధురకంఠంతో ఎన్నో పాటలు పాడి ప్రేక్షకాదరణ పొందిన గొప్ప సింగర్. ఒక మారుమూల గ్రామంలోని సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈయన... సినీ ఇండస్ట్రీలో చెరిగిపోని చిరకాల ప్రత్యేక గుర్తింపును సాధించారు. గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన 'సుందరకాండము' (రామాయణంలోని ఒక భాగం), తులసీ దాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణి పాడటం... ఈ రెండూ ఈయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.
జీవిత చరిత్ర :
1921 మార్చి 7వ తేదీన గుంటూరు జిల్లా అమృతలూరు మండలానికి చెందిన మోపర్రు గ్రామంలో ఎమ్మెస్ రామారావు జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మోపర్తి రంగయ్య-మంగమ్మ! రామారావుకు చిన్నతనం నుంచే పాటల మీద ఎంతో ఆసక్తి వుండేది. ఈయన విద్యాభ్యాసము నిడుబ్రోలు ఉన్నత పాఠశాలలో, గుంటూరు హిందూ కళాశాలలో జరిగింది. రామారావు గారికి 1942 లో లక్ష్మీ సామ్రాజ్యంతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె (వెంకట సరోజిని), ఇద్దరు కుమారులు (బాబూరావు, నాగేశ్వరరావు).
సినీరంగంలో రామారావు ప్రస్థానం :
1941లో ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతున్న రోజుల్లో... అంతర్ కళాశాలల లలిత సంగీత పోటీల్లో పాల్గొన్నారు. ఆ పోటీల్లో ఇతరులకంటే ఈయన అద్భుతమైన స్వరంతో అక్కడున్నవారిని మైమరిపించేవారు. దాంతో ఆయన మొదటి బహుమతి గెలుచుకున్నారు. ఆ సమయంలోనే ఆ పోటీలకు జడ్జిలుగా వ్యవహరించిన వారిలో ఒకరైన అడవి బాపిరాజు.. రామారావును చలన చిత్ర రంగంలో ప్రవేశించమని చాలా ప్రోత్సహించారు. ఆ విధంగా ఆయన ప్రోత్సాహించిన మేరకే ఈయన పరిశ్రమలో ప్రవేశించారు.
1944లో ప్రఖ్యాత సినీ దర్శకనిర్మాత వై.వి.రావు తన ‘తహసీల్దార్’ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటిసారిగా ‘ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా’ అనే పాట పాడించారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇది మొట్టమొదటి నేపథ్యగానం. ఇక అప్పటినుంచి ఆయన వెనుదిరగలేదు. 1944 నుంచి 64 వరకు మద్రాసులో వుంటూ తెలుగు చలన చిత్రాలలో నేపథ్య గాయకునిగా కొనసాగారు. అలాగే 5 సంవత్సరాలపాటు కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకుని, కొన్ని పాటలు వ్రాసి గ్రామ్ ఫోన్ రికార్డులు కూడా ఇచ్చారు.
1963లో కొన్ని కారణాల వల్ల మద్రాసు వదిలి రాజమండ్రి చేరుకున్నారు. అక్కడ నవభారతి గురుకులంలో 10 సంవత్సరాలు ఉద్యోగం చేసారు. 1972 నుండి 74 వరకు తులసీదాసు హనుమాన్ చాలీసాను హిందీ నుంచి తెలుగులోనికి అనువదించారు. తన పేరుతో అవినాభావ సంబంధమేర్పడ్డ 'సుందరకాండ' గేయరచన చేశారు. రామారావుకు 1977లో ‘సుందరదాసు’ అనే బిరుదాన్ని ఇచ్చారు. ఈయన ఏప్రిల్ 20, 1992న హైదరాబాదులో సహజ కారణాల వల్ల మరణించారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more