''అన్యాయాన్నెదిరించడం.. నా జన్మహక్కు–నా విధి
అన్యాయాన్నెదిరిస్తే.. నాగొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే.. నా గొడవకు ముక్తి, ప్రాప్తి
అన్యాయాన్నెదిరించినోడు.. నాకు ఆరాధ్యుడు''
అంటూ.. తన పదునైన అక్షరాలతో అన్యాయంపై యుద్ధభేరి మోగించారు ప్రజాకవి, రచయిత, వక్త, పౌరహక్కుల నేత, స్వాతంత్ర్య సమరయోధుడు, పద్మ విభూషణ్.. డాక్టర్ కాళోజీ నారాయణ రావు.
పుటక, చావునీది బతుకంతా దేశానిది...
'పుట్టుక నీది.. చావునీది.. బతుకంతా దేశానిది' అంటూ ప్రతి పౌరుడూ దేశానికి చేయాల్సిన సేవను వ్యక్తపరిచారు కాళోజీ నారాయణరావు. చెప్పడమే కాదు.. అక్షరాలా దానికి కట్టుబడి జీవితమంతా ప్రజాసేవలో గడిపారు. 1914 సెప్టెంబర్ 9న కాళోజీ జన్మించారు. పాతికేళ్ల ప్రాయంలో సంఘ సంస్కర్త, వేలూరి మాణిక్యరావు కుమార్తె రుక్మిణీబాయిని పెళ్లాడారు. కుటుంబ బాధ్యతలన్నీ అన్న రామేశ్వరరావుకి వదిలి నాటి నిజాం ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఖండిస్తూ ప్రజల కష్టసుఖాలను గమనిస్తూ గ్రామాలలో తిరుగుతుండేవాడు. అన్యాయాలను ఖండిస్తూ ప్రజల మనిషిగా మారాడు. ఏడు దశాబ్దాలకు పైగా ప్రజాబాహుళ్యంలో విస్తరించిన తొమ్మిది దశాబ్దాల నిండు జీవితంలో విస్తృతమైన రచనను మనకు విశ్లేషణా వస్తువుగా, ఆదర్శంగా, పాఠంగా మిగిల్చి వెళ్లిపోయారు.
బాల్యం నుంచే అన్యాయంపై ఎదురుదాడి..పాఠశాల విద్యార్థి దశ నుంచి మరణానికి కొద్దినెలల ముందు వరకూ ఆయన సాంఘిక జీవితం మొత్తంలోనూ అన్యాయం అని ఆయన భావించిన, గుర్తించిన అంశాల మీద తిరుగుబాటు సాగించారు. దానిపై పోరాటమే ఆయన స్వభావంగా కొనసాగింది. ఆ తిరుగుబాటును తన కవిత్వంలో, సంభాషణలో, ఉపన్యాసంలో, ఆచరణలో, సామాజిక జీవనంలో ప్రతి చోటా చూపించారు.. ఆచరించారు. దేశ ప్రజలందరి ప్రాథమిక హక్కులను రద్దు చేస్తూ ఇందిరాగాంధీ విధించిన
ఎమర్జెన్సీ ప్రజాస్వామికవాదులందరినీ కదిలించింది. ఆ సందర్భంలో బైట ఉండి అవకాశం వచ్చిన చోటనల్లా ఆ అన్యాయంపై కాళోజీ తిరుగుబాటు ప్రకటించారు.
మాతృభాష గొప్పదనాన్ని చాటుతూ...
తెలుగు భాష గొప్పదనాన్ని సైతం కాళోజీ చాటిచెప్పారు.
‘‘తెలుగు బిడ్డవయ్యి తెలుగు రాదంచును
సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా..?
దేశ భాషలందు తెలుగు లెస్సయటంచు
తెలుగు బిడ్డా ఎపుడు తెలుసుకొందువురా..?
అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా?’’
అంటూ నిరాఘాటంగా విమర్శించినవారు కాళోజి. ఇలాంటి అలుపెరగని ప్రజాకవి శతజయంతి ఉత్సవాల సందర్భంగా 'తెలుగువిశేస్.కామ్ నివాళులర్పిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more